తెలుగు రాష్ట్రాల ఎంపీలకు వెంకయ్య మద్ధతు

 

దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ చెప్పిన సంగతి తేలిసిందే. దీనిపై ఏపీలో కూడా నిరసనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏంపీలు కూడా పార్లమెంట్ లో ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పై మంగళవారం పార్లమెంట్ లో వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదా చాలా సున్నితమైన అంశమని.. ఇది విభజన చట్టంలో లేదని.. కాని దీనిపై ఆర్ధిక శాఖ చర్చలు జరుపుతుందని.. ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అంతేకాక ప్రత్యేక హోదా విషయంపై తెలుగు రాష్ట్రాల ఎంపీలు చేసే ఆందోళనలో అర్ధం ఉందని ఎంపీలకు మద్దతుగా నిలిచారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu