గవర్నర్ కు రాజీనామా లేఖ అందించిన ఊమెన్ చాందీ

 

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తన పదవికి రాజనీమా చేశారు. ఈరోజు ఉదయం గవర్నర్ పి.సదాశివమ్ ను కలిసి తన రాజీనామా లేఖను అందేజేశారు. కాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పొందిన సంగతి తెలసిందే. మొత్తం.. 140 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో.. ఎల్డీఎఫ్ 91 స్థానాలలో, యూడీఎఫ్ 47 స్థానాలు, బీజేపీ ఒక స్థానం.. ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.