కాంగ్రెస్ మంత్రులకు కాలం చెల్లుతోందా?

కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొంది మంత్రి పదవులు అందుకున్న వారందరూ ఏదో ఒక విచారణను ఎదుర్కోక తప్పటం లేదు. జగన్ అక్రమాస్తుల కేసులో ఐదుగురు మంత్రులు సిబీఐ విచారణ జాబితాలో ఉన్నారు. అలాన్నే మద్యం ఎం.ఆర్.పి. కన్నా అధికధరలకు అమ్ముతున్న కేసులో మరో ఇద్దరు మంత్రులు నిందితులయ్యారు. ఇప్పుడు కొత్తగా మరో ఇద్దరు మంత్రులు సున్నపురాయి నిక్షేపాలు ప్రైవేటు వ్యక్తికీ ధారాదత్తం చేసిన కేసులో హైకోర్టు నోటీసులు అందుకున్నారు. మంత్రులు గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాపరెడ్డి కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేటు వ్యక్తికీ సున్నపురాయి నిక్షేపాలను కట్టబెట్టారని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు జగన్ అక్రమాస్తుల కేసులో నిందుతులయ్యారు. వాన్ పిక్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి మోపీదేవి వెంకటరమణ తన పదవిని త్యాగం చేయక తప్పలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu