విద్యార్థులను పీడిస్తున్న పాఠ్యపుస్తకాల కొరత?

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడింది, దీనికి ప్రధానంగా రవాణా సమస్యే కారణమని సమాచారం వస్తోంది. పుస్తకాల ముద్రణ పూర్తయినా ఉపఎన్నికల వల్ల రవాణా దెబ్బతిందని తెలుస్తోంది. మొత్తం 12 జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికల వల్ల వాహనాల కొరత, ఇతర సమస్యలూ కూడా పాఠ్యపుస్తకాల కొరతకు కారణమైంది. ప్రత్యేకించి 20 జిల్లాల నుంచి ఈ సమస్య గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొన్ని జిల్లాల్లో హిందీ, సైన్స్ పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని జిల్లాలో హిందీ పుస్తకమే దొరికిందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. జిల్లాకు సుమారుగా ఇరవైలక్షల పైచిలుకు పాఠ్యపుస్తకాలు అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముద్రణాలయం జిల్లాల వారీగా అవసరాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను ముద్రించింది. ప్రతీ జిల్లాలోనూ ఇంకో మూడు రోజుల్లో పుస్తకాలు వచ్చేస్తాయని చెబుతున్నారు. కడప జిల్లాకు 26 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమైతే ఇప్పటి వరకు 8 లక్షల పుస్తకాలు మాత్రమే అందాయి. మిగిలిన పుస్తకాలు త్వరలో వస్తాయని అధ్కారులు తెలిపారు. అలానే తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో పాఠ్యపుస్తకాల్లో ఒక సబ్జెక్టు, మరో పుస్తకం మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu