మినరల్ కెమిస్ట్రీ చదివితే ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇస్తారా?

పీజీ చేసి ప్యూన్ గా ఉద్యోగం సరిపెట్టుకునే ఈ రోజుల్లో ... మినరల్ కెమిస్ట్రీ చదివి ఆక్నూ (ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ)లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసున్న ఒక వ్యక్తి వైనం ఇది. గత విద్యాసంవత్సరం క్లాసులు ముగిసేసమయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆక్నూలో అనదికార్ల ప్రొఫెసర్ల దందా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం పదేళ్ళు పూర్తి చేయకుండానే పి.హెచ్.డి. పూర్తయినట్లు నేరుగా ప్రొఫెసర్ హోదాలు ఇక్కడ కల్పించారు. అయితే ఈ హోదా ఎవరు కల్పించారన్న అంశంపై విసితో కలిసి విచారణ కమిటీ తెలుసుకుంటోంది. రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆదినుంచి సమస్యలతోనే ప్రారంభమైంది. ఈ యూనివర్సిటీకి స్థలాన్ని సేకరించిన తరువాత గతేడాదే క్లాసులు ప్రారంభమయ్యాయి. కాకినాడ జె.ఎన్.టి.యు. విసి అల్లం అప్పారావుకు యూనివర్సిటీ అదనపు బాధ్యతలు అప్పగించాక ఆయన విశ్వవిద్యాలుయ స్థలాలను చూసి గదుల నిర్మాణం వేగిరం చేస్తూనే క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత ఈ ఏడాది క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. గతేడాది క్లాసులు ముగింపు సమయంలో వచ్చిన అనధికార ప్రొఫెసర్లు దండా విచారణతో తరగతులు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి విసి ఉన్నతస్థాయి విచారణ బృందానికి తనకు తెలిసిన సమాచారం ఇస్తూవచ్చారు. అయితే ఆ బృందం జరిగిందేమిటో తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. విసి కూడా ఆ ప్రొఫెసర్లను రప్పించి విషయం కనుక్కుంటున్నారు. పదేళ్ళ సీనియార్టీ చూపేందుకు ఒక ప్రొఫెసర్ తాను మహబూబ్ నగర లోని ప్రైవేటు విద్యాసంస్థలో పదేళ్ళు పనిచేసినట్లు ధృవపత్రాన్ని జతచేయటం కూడా నిబంధనల అతిక్రమణ కిందకే వస్తుంది. దీంతో ఆ ప్రొఫెసర్ తోనూ విసి చర్చించారు. అలానే మినరల్ కెమిస్ట్రీ చదివి ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని విచారించారు. విశ్వవిద్యాలయంలో అన్నీ నిబంధనల ప్రకారం ఉండాల్సిందేనని విసి స్పష్టం చేశారని సమాచారం. విచారణ బృందం నివేదిక ఇచ్చాకైనా ఇటువంటి ఆరోపణలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని విసి నిర్ణయం తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu