LATEST NEWS
  తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌కు పాదయాత్ర చేయనిస్తారా? అనే ప్రశ్నను కంఠంనేని రవిశంకర్ లేవనెత్తారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, చంద్రబాబు డిక్టేటర్ కాదు… డెమోక్రాట్ అని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదని  గుర్తుచేశారు. జగన్ బూచీ చూపిస్తే ఓట్లు పడతాయని చంద్రబాబు, లోకేశ్ భావిస్తున్నారని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆర్గానిక్ నేతలకు ఇన్‌ఆర్గానిక్ పదవులు లేవని, జ్యోతీబసు, బుద్ధబట్టాచార్య వంటి వారు వేరే పార్టీలోకి వెళ్లలేదని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన సిద్ధాంతాలు లేవని ఆయన విమర్శించారు. మరోవైపు, వైసీపీ నాయకులు మాయలో ఉన్నారని, ఇసుక దందాలు, గనుల వ్యవహారాల్లో.. దేశంలో ఒక రకం న్యాయం, పేదలకు మరో రకం న్యాయం ఉందా? అని రవిశంకర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు అరెస్టులు చేస్తే ప్రజల్లో సానుభూతి కలుగుతుందని పార్టీలు భావిస్తున్నాయని కూడా చర్చలో ప్రస్తావన వచ్చింది. ఈ వంటి అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి రాజకీయం అంతా బెదరింపులు, దబాయింపులేనా? అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన తీరు మారదా? యధా జగన్.. తథా వైసీపీ అన్నట్లుగా ఆ పార్టీ నేతలూ, కార్యకర్తలూ అలాగే వ్యవహరిస్తారా? అంటే పరిశీలకులే కాదు, జనబాహుల్యం కూడా ఔననే అంటున్నది. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల పాటు జగన్ పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు  గత ఎన్నికలలో ఆయనను ఛీకొట్టారు. కేవలం 11 స్థానాలను మాత్రమే ఇచ్చి ప్రతిపక్షనేతగా జగన్ కు, ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి అర్హత లేదని తమ ఓటు ద్వారా కుండబద్దలు కొట్టారు.   ఇందుకు ప్రధాన కారణం జగన్ పాలన, , బూతులు వినా మరో భాష తెలియదన్నట్లుగా వ్యవహరించిన ఈ పార్టీ నేతల తీరు కారణమనడంలో సందేహం లేదు.  జగన్ హయాంలో  అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్య‌లు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు,    దౌర్జ‌న్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.  అయితే అంతటి ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు ఇసుమంతైనా మారలేదని.. ఈ పద్దెనిమిది నెలల కాలంలో తేలిపోయింది.  ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ   బెదిరింపుల రాజ‌కీయాలనే నమ్ముకుంది.  చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌ల‌పై దారుణ‌మైన వ్యాఖ్య‌ల‌తో మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌, పేర్ని నాని విరుచుకుప‌డుతున్న తీరు   అదే సూచిస్తోంది.  చంద్రబాబుపై బూతులతో రెచ్చిపోయి అరెస్టైన అంబటి రాంబాబుకు మద్దతుగా, ఆయన కుటుంబ సభ్యుల పరామర్శ పేర జగన్ గుంటూరు పర్యటనలో జగన్ దబాయింపులు, బెదరింపులతో రెచ్చిపోయారు. తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.   ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌తి విష‌యాన్నీ రాసి పెట్టుకుంటున్నామన్నారు.   అయితే జగన్ తీరు పట్ల, ధోరణి పట్ల ప్రజలలోనే కాదు, వైసీపీలోనే అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  జగన్ ఈ ధోరణే రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ అంతకంతకూ దిగజారిపోవడానికి కారణమౌతోంది. తాజాగా ఇండియాటుడే సీఓటర్ నిర్వహించిన సర్వేలో గత ఎన్నికలలో కంటే, ఇప్పుడు జగన్ పట్ల, వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత మరింతగా పెరిగిందని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, వైసీపీకి 2024 ఎన్నికలలో వచ్చినన్ని సీట్లు, ఓట్లు వచ్చే అవకాశం ఇసుమంతైనా లేదని కుండబద్దలు కొట్టింది. గత ఎన్నికలలో 40 శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్న ఆ పార్టీకి ఇప్పుడు ఎన్నికలు జరిగితే అప్పటి కంటే చాలా తక్కువ శాతం ఓట్లు పడతాయని ఆ సర్వే పేర్కొంది. ఇప్పటికైనా జగన్ తీరు మారకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అయ్చే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.  
రాష్ట్ర రాజకీయాల్లో హీట్  పెంచుతున్న తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు. ఇరువురే ముఖాముఖీ కూర్చుని తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంలో వైసీపీ  దుర్మార్గపు ప్రచారం చేయడమే కాకుండా కుల చిచ్చు రేపడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది.  బుధవారం (ఫిబ్రవరి 4)జరిగిన ఈ భేటీలో అటు లడ్డూ కల్తీ నివేదికపై తదుపరి యాక్షన్, ఇటు రాజ్యసభ సీట్ల కేటాయింపు.. రాష్ట్రంలో పాలన తదితర అంశాలపై కూడా ఈ భేటీలో వీరు చర్చించినట్లు చెబుతున్నారు.   రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా   అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.  కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలను దీటుగా ఎదుర్కొనేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనీ,  క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య  విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ ఎత్తుగడలకు క్యాడర్ సమన్వయంతో చెక్ పెట్టేలా ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పని చేయాలని వారికి దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్   నివేదిక పై కూడా వీరిరువురూ సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో   68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా అయిందని, కేవలం రసాయనాలు, పామాయిల్ కలిపి దీనిని సృష్టించారని సిట్ నివేదిక నిర్ధారించిన నేపథ్యంలో ఈ కల్తీ వ్యవహారంలో సూత్రధారులను వదిలిపెట్టకూడదన్న నిర్ణయానికి వచ్చారు.  కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో, కేవలం శాఖాపరమైన చర్యలకే పరిమితం కాకుండా.. బాధ్యులందరిపై చట్టప్రకారం చర్య తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు జనసేన, తెలుగుదేశం వర్గాల ద్వారా లెతుస్తోంది.  
ALSO ON TELUGUONE N E W S
  -అభిమానులకి బాధని కలిగిస్తున్న ప్రియాంక మాటలు  -ఎందుకు అలా జరిగిందంటూ కామెంట్స్  -వారణాసి పై భారీ అంచనాలు   పాన్ ఇండియా యాక్ట్రస్ అనే స్థాయి దాటి పాన్ వరల్డ్ యాక్ట్రస్ అనే స్థాయికి ఎదిగిన 'ప్రియాంక చోప్రా(Priyanka Chopra)సినీ జర్నీ తెలిసిందే. ప్రెజంట్  మహేష్ బాబు(Mahesh Babu) రాజమౌళి(ss Rajamouli)ల 'వారణాసి'(Varanasi)తో బిజీగా ఉంది. ఆ ఇద్దరు ఏరి కోరి మందాకినీ అనే క్యారక్టర్ కి ప్రియాంక ని సెలక్ట్ చేసారు. అంటే తన వల్ల వారణాసి విజయ నాదానికి ఎంత లాభం జరగబోతుందో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద కూడా ప్రియాంక మాయాజాలం వారణాసి కి అదనపు ఆకర్షణ అని  చెప్పుకోవడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చెప్పిన విషయాలు అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కర్ని ఎంతో ఆవేదనకి గురి చేస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. ప్రియాంక మాట్లాడుతు నా పాప పేరు మాల్తీ మేరీ. నెలలు నిండకుండానే మూడు నెలల  ముందుగానే మాల్తీ జన్మించింది. ఆ సమయంలో తను 765 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో కొన్ని నెలలపాటు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. పైగా అప్పుడు కరోనా సమయం. దాంతో చావు బతుకల మధ్య మాల్తీ హాస్పిటల్ లోనే పోరాటం చేసింది. మూడు నెలల్లో ఆరు సార్లు రక్తం మార్చారు. ఆ టైంలో చాలా భయంగా బతికాం. చివరకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుని మాల్తీ క్షేమంగా బయటపడిందని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూ సమయంలో తన భర్త నిక్ జోనస్ కూడా ప్రియాంక పక్కనే ఉన్నాడు.    Also read: Epstein files: ఎప్ స్టీన్ కుంభకోణంలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు!  అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్(Nick Jonas)ప్రియాంక కి 2018 లో వివాహం జరిగింది. ప్రియాంక కి కన్నా పదేళ్ల చిన్నవాడు. సరోగసి ద్వారా మాల్తీ మేరీ కి జన్మనిచ్చారు. అమెరికాలోనే సెటిల్ అయిన ప్రియాంక వారణాసి షూటింగ్ కోసమే ఇండియాలో ఉంది.      
  -ఇంటి నుంచి గెంటి వెయ్యవల్సిన పరిస్థితి ఏంటి  -మాధవన్ కి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది  -అసలు మాధవన్ చేసిన నేరం ఏంటి -ఆ ఇద్దరికి పెళ్లి ఎప్పుడు జరిగింది   ఆర్ మాధవన్(R Madhavan)ఈ పేరుకి సిల్వర్ స్క్రీన్ కి, సినీ ప్రియులకి ఉన్న అనుబంధం రెండున్నర  దశాబ్దాలపైనే. అంతలా హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పిస్తూ వస్తున్నాడు. మెప్పిస్తుండటమే కాదు తన చరిష్మా కి సంబంధించి ఎక్స్ పైరీ డేట్ కి నో ఛాన్స్ అంటు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రీసెంట్ గా ఇండియన్ సినిమా గొప్పతనాన్ని చాటుతూ 1300 కోట్ల క్లబ్ లోకి చేరిన ధురంధర్(Dhurandhar)లో ఐబీ ఆఫీసర్ అజయ్ సన్యాల్ గా చేసి ప్రేక్షకులు ధురంధర్ లో లీనమయ్యేలా చేసాడు. రియల్ గా మన దేశపు ఎన్ ఎస్ ఏ ఆఫీసర్ అజిత్ దోవల్ అనే నిజమైన క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసి మాధవన్ కి ఎక్స్ పైరీ డేట్ అనేది లేదని ప్రేక్షకులు కూడా అనేలా చేస్తున్నాడు. అలాంటి మాధవన్ ని భార్య ఇంట్లో నుంచి పంపించేసిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.   మాధవన్ రీసెంట్ గా ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూలో మాట్లాడుతు కరోనా సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నాను. అప్పుడు నా భార్య నాతో మాట్లాడుతు నువ్వెప్పుడూ ఖాళీగా ఇంట్లోనే కూర్చోకుండా సినిమాలు, ఓటిటి ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంటుంటావు. కానీ ఇప్పుడు  బయటకి వెళ్లినా త్వరగా వచ్చేస్తున్నావు.గతంలో ఉన్నంత ఉత్సాహం నీలో కనిపించడం లేదు. అసలు నువ్వు బాగానే ఉన్నావా! లేదా! ఎప్పటిలాగానే బయటకి వెళ్లి డబ్బు సంపాదించు అని మా ఆవిడ చెప్పింది. ఆ మాటలు నాలో ఆలోచనలు కలిగించడంతో పాటు నాపై ఎంతో ప్రభావం చూపించాయని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే ఇంటర్వ్యూ లో టోటల్ గా అవే మాటల సారాంశం మొత్తాన్ని'నా భార్య కోవిడ్ సమయంలో డబ్బు సంపాదించమని ఇంట్లో నుంచి గెంటివేసిందనిగా సరదాగా చెప్పడంతో  మాటలు వైరల్ గా నిలిచాయి.   Also read:   25 రోజులకి గాను ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే.. బుక్ మై షో నే సాక్ష్యం   మాధవన్ వైఫ్ పేరు సరితా బిర్జే(Sarita Birje).. 1999 లో ఆ ఇద్దరి వివాహం జరగగా మాధవన్ ఫిలిం  ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు.పెళ్లి తర్వాతనే లెజండ్రీ మేకర్ మణిరత్నం డైరెక్షన్ లో సఖి మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. జార్ఖండ్ కి చెందిన  మాధవన్ కి అదే తొలి చిత్రం. ఇక అక్కడుంచి తన ప్రభావాన్ని చాటుతూ వస్తున్నాడు. ఇటివల 2026 కి సంబంధించి ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి మాధవన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఎంపిక కావడం కంటే పద్మశ్రీ నే వెతుక్కుంటూ వచ్చిందని చెప్ప్పవచ్చు. అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2)తో ఈ సారి పాకిస్థాన్ లో జరపబోయే తన ఆపరేషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మార్చి 19 న తెలియబోతుంది.  
  -అభిమానులు ఇప్పుడు ఏమంటారో  -తొలి తెలుగు చిత్రంగా నిలిచిందా! -అసలు మొత్తం కలెక్షన్స్ ఎన్ని! -ఓటిటి లోకి వస్తుందా  'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)తో చిరంజీవి(Chiranjeevi)తన సినీ కెరీర్ ని ఇప్పుడే స్టార్ట్ చేశాడా అనేలా  సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అంతలా యాక్టింగ్, డాన్స్, లుక్స్ తో రఫ్ఫాడించాడు. విక్టరీ వెంకటేష్ కూడా యాడ్ అవ్వడంతో హిట్ రేంజ్ కి సరికొత్త పదాలని కనిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మాస్ జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకులని ఫ్యామిలీ ప్రేక్షకుల్లా, ఫ్యామిలీ జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకులని మాస్ ప్రేక్షకులుగా కూడా మార్చివేసిన ఘనత ని మన శంకర వర ప్రసాద్ అందుకున్నాడు. మరి వాళ్లందరూ ఇంతవరకు ఏ మేర కలెక్షన్స్ ని కట్టబెట్టారో చూద్దాం. 2026 సంక్రాంతికి పర్యాయపదంలా నిలబడాలనే ఉద్దేశ్యంతో  జనవరి 12 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన మన శంకర వరప్రసాద్ గారు నిన్నటితో పాతిక రోజులని పూర్తి చేసుకుంది. ఈ మేరకు సినీ ట్రేడ్ సర్కిల్స్ లో  375 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నట్టుగా న్యూస్ వినపడుతుంది. మేకర్స్ సైతం సదరు ప్రకటనపై అధికార ప్రకటన ఇచ్చేసారు. కేవలం తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యి 375 కోట్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా కూడా మన శంకర వరప్రసాద్ నిలిచింది. ఫస్ట్ వీక్ నుంచే ఆ రికార్డుని తన పేరుపై ఉంచుకుంటు వస్తున్న విషయం తెలిసిందే. బుక్ మై షో లో ఇప్పటి వరకు 3 .6 మిలియన్ల టికెట్స్ సోల్డ్ అయ్యాయని సదరు యాప్ నిర్వాహకులు కూడా అధికారకంగా ప్రకటించారు. Also read:  టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. అందుకు అలా చేస్తున్నారు   ఇక మన శంకర వర ప్రసాద్ గారు ఓటిటి లో ఎప్పుడు అడుగుపెడ్తాడని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో స్ట్రీమింగ్ హక్కులని పొందిన  జీ 5 సంస్థ అధికారకంగా ప్రకటించకపోయినా తమ యాప్ వెబ్ సైట్ లో  ఈ నెల 11 న స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా ఉంచింది. మరి త్వరలోనే ఓటిటి కి సంబంధించి అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి.    
  -వివాదంలో ఘూస్‌ఖోర్ పండత్ -అసలు  ఘూస్‌ఖోర్ పండత్ అనే అర్ధం ఏంటి! -ఎవరు ఎవర్ని టార్గెట్ చేశారు తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది. బాలీవుడ్ తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా పెర్ ఫార్మెన్స్ కి ఉన్న పదును ఏ మాత్రం తగ్గకుండా అభిమానులు గర్వపడేలా రాణిస్తూ ఉన్నాడు. ఈ కోవలోనే 'ఘూస్‌ఖోర్ పండత్’(Ghooskhor Pandat)అనే మూవీతో నెట్ ఫ్లిక్స్ వేదికగా రావడానికి ముస్తాబు అవుతున్నాడు.  మూడవ తారీఖున టీజర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ బ్రాహ్మణ కమ్యూనిటీ ఆగ్రహ జ్వాలలకి గురవుతుంది. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.   ఘూస్‌ఖోర్ పండత్.. పండత్ లేదా పండిత్ అనే వర్డ్  బ్రాహ్మణ కమ్యూనిటీ కి గుర్తింపు. ఘూస్‌ఖోర్ అంటే లంచగొండి అని అర్ధం. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బ్రాహ్మణులని అవమానించడానికే ఈ విధమైన టైటిల్ ని ఫిక్స్ చేసారు. వెంటనే ఘూస్‌ఖోర్ పండత్ అనే టైటిల్ ని తొలగించక పోతే దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఈ రకమైన టైటిల్ ని ఉపయోగించగలరా! హీరో క్యారక్టర్ పేరు అజయ్ దీక్షిత్ అనే పేరు కూడా మార్చాలని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ హైకోర్ట్ లో ఈ విషయంపై బ్రాహ్మణ సంఘాలు పిటిషన్ కూడా నమోదు చేసాయి. అయితే ఇంకా ఈ ఇష్యుపై  మనోజ్ బాజ్ పేయి గాని చిత్ర బృందం గాని  స్పందించలేదు.   Also read: 16 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో అందరు ఈ పని చెయ్యాలి..సోను సూద్ డిమాండ్     ఘూస్‌ఖోర్ పండత్ లో అజయ్ దీక్షిత్ అనే బ్రాహ్మణ వర్గానికి చెందిన పోలీసు అధికారి గా    మనోజ్ బాజ్‌పేయి చేస్తున్నాడు.దీక్షిత్ ముద్దు పేరు పండత్. అవినీతి, కోపం, క్రూరత్వంతో నిండిన పోలీసు అధికారి గా చేస్తున్నాడని టీజర్ లో చాలా స్పష్టంగా చెప్పారు.రితేష్ షా దర్శకత్వంలో నీరజ్ పాండే నిర్మించాడు. అతిరధ మహారధులు కనిపిస్తున్న ఈ మూవీ ట్రయిలర్ ఈ రోజు రిలీజ్ కావాలి. కానీ నిరసనల మధ్య రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.  రిలీజ్ డేట్ కూడా ఇంకా ప్రకటించలేదు.    
  - గాయాలపాలైన సంయుక్త మీనన్ - 'ది బ్లాక్ గోల్డ్' కోసం డూప్ లేకుండా భారీ ఫైట్లు - గాయాలను సైతం లెక్క చేయకుండా షూటింగ్ కొనసాగింపు   తన అందం, అభినయంతో ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి మారిపోయింది. ప్రస్తుతం ఆమె 'ది బ్లాక్ గోల్డ్'(The Black Gold) అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది.    'ది బ్లాక్ గోల్డ్' కోసం డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తుంది సంయుక్త. ఈ క్రమంలోనే ఆమెకు గాయాలు అయ్యాయి. అయితే గాయాలను సైతం లెక్క చేయకుండా షూటింగ్ కొనసాగిస్తోంది.    ఈ మూవీలో సంయుక్త మీనన్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలవనున్నాయట. సంయుక్త కెరీర్ లో 'ది బ్లాక్ గోల్డ్' ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుందని మూవీ టీమ్ నమ్మకంగా ఉంది.   కొందరు హీరోలే డూప్స్ సహాయంతో యాక్షన్ సీన్స్ చేస్తుండగా.. సంయుక్త  గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీన్స్ చేస్తుండటంపై ప్రశంసలు కురుస్తున్నాయి.     పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాగా 'ది బ్లాక్ గోల్డ్' చిత్రాన్ని యోగేష్ కెఎంసి రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.    ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 'ది బ్లాక్ గోల్డ్' సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు  ప్లాన్ చేస్తున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు,  మరెన్నో గొప్ప  ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి.  నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా,  మెసెజ్ చేయాలన్నా, మెయిల్ పంపాలన్నా కేవలం సెకెండ్లు, నిమిషాల వ్యవధిలో జరిగిపోతూ ఉంటుంది.  కానీ మూడు దశాబ్దాల క్రితం ఈ వెసులుబాట్లు ఉండేవి కాదు.. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ అడ్డంకిని అధిగమించడానికి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆకాశాన్నే తమ మార్గంగా ఎంచుకుని హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. అప్పట్లో కమ్యూనికేషన్ రంగంలో ఈ సర్వీస్ చరిత్ర సృష్టించింది.  ఎంతో ఆసక్తికరమైన ఈ సర్వీస్ గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ఎంతో విప్లవాత్మకమైన భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను భారతదేశంలో జనవరి 27వ తేదీ,  1988లో ప్రారంభించారు. భారతదేశం ద్వీప సమూహాలతో కూడుకుని ఉంటుంది.   ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకు ఏదైనా సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ చారిత్రాత్మక హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్ కు ఈ దీవులే ప్రారంభ వేదికగా నిలిచాయి. మొదటి విమానం పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపానికి సమాచారాన్ని చేరవేసేది. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ప్రాధమిక ఉద్దేశ్యం మారుమూల ప్రాంతాలకు కూడా మెయిల్ ను డెలివరీ చేయడం. గతంలో మెయిల్ చేరుకోవడానికి రెండు నుండి మూడు రోజులు పట్టే ప్రాంతాలు కాస్తా హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ వచ్చాక ఆ దూరం,  సమయం చాలా తగ్గాయి. భారత తపాలా శాఖ.. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను విజయవంతం చేయడానికి బారత తపాలా శాఖ పవన్ హన్స్ లిమిటెడ్ తో కలిసి పనిచేసింది. ఈ సేవలో ప్రధానంగా డౌఫిన్ హెలికాప్టర్ ను ఉపయోగించారు. తొలి విమాన ప్రయాణ గుర్తుగా ఫస్ట్ డే కవర్లు జారీ చేయబడ్డాయి.  వీటిలో చాలా స్పెషల్ గా పిలువబడే హెలికాప్టర్ మెయిల్ స్టాంప్ కూడా ఉంది.  ఇది నేటికీ తపాలా చరిత్రలో విలువైన రికార్టు కావడం విశేషం. ప్రపంచంలో హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ప్రపంచంలో మొట్టమొదటి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ అక్టోబర్ 1, 1947న అమెరికాలో ప్రారంభమైంది. US పోస్టల్ సర్వీస్, లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్‌తో కలిసి, సికోర్స్కీ S-51 రోటరీ-వింగ్ హెలికాప్టర్‌ను ఉపయోగించి  ఈ సర్వీస్ ను నడిపింది. అమెరికా విజయం సాధించిన ఒక సంవత్సరం తర్వాత, యునైటెడ్ కింగ్‌డమ్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇదీ భారతదేశంలో జరిగిన హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ గురించి ఆసక్తికరమైన సమాచారం.                                  *రూపశ్రీ.
క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా అదిక శాతం జనాభాను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్య.  క్యాన్సర్ వచ్చింది అంటే ఇక చావు ఖాయం అని అనుకుంటారు.  ఒక వేళ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న.. దీని చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో మధ్యతరగతి,  దిగువ తరగతి కుటుంబాలు మనుషుల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు,  ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. 2045 నాటికి భారతదేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి ఏటా 1.5 మిలియన్ల నుండి 2.45 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో క్యాన్సర్ అనేది ప్రధానమైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారతదేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. 2045 నాటికి ప్రతి ఏడాది నమోదు అయ్యే క్యాన్సర్ కేసులు 15 లక్షల నుండి 24 లక్షలా 50వేల వరకు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి క్యాన్సర్ ఎంత ఉదృతంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.  దీని గురించి ఆరోగ్య నిపుణులు,  ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలామంది క్యాన్సర్ ఉందని తెలిసిన తరువాత లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం అనే విషయం మీదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అని చెబుతున్నారు. కానీ క్యాన్సర్ వచ్చిన తరువాత వైద్యం గురించి ఆలోచించడం కంటే.. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే దిశగా ఉండటం మంచిదని చెబుతున్నారు. క్యాన్సర్ కు చికిత్స మాత్రమే సరైన మార్గం కాదు.. దీని కోసం ముందస్తు స్క్రీనింగ్ కు హాజరు కావడం,  జీవనశైలి మార్చుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేయడం, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం,  శరీరంలో ఏదైనా అసౌకర్యం అనిపించినా,  ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు, చర్మం రంగు మారడం,  శరీరంలో మార్పులు వంటివి జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించడం వంటివి చేయాలని అంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ కు ఖరీదైన చికిత్స అనే వరకు వెళ్లకుండా దాన్ని విత్తనం దశలోనే నిర్మూలించేందుకు వీలవుతుంది.  పైగా ఇలాంటి పరిస్థితిలో క్యాన్సర్ ను నయం చేయడం కూడా తక్కువ ఖర్చులోనే జరిగిపోతుంది. ప్రభుత్వ విధానాలు.. తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  ఈ బడ్జెట్ లో క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకటించింది. క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ మినహాయింపులు,  దేశీయ బయోపార్మాస్యూటికల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటివి బడ్జెట్ లో ఉన్నాయి. ప్రజలు చేయాల్సినది.. క్యాన్సర్ అనేది భారతదేశంలో ఎవరికైనా రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు.. కానీ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు.  క్యాన్సర్ గురించి ప్రతి వ్యక్తి తనకు తాను జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీనింగ్ కు హాజరు కావాలి,  శరీరంలో ఏ మార్పును నిర్లక్ష్యం చేయకూడదు,  ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన  ఆహారం తీసుకోవడం,  వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా గడపడం వంటివి చేయాలి.  ఇలా చేస్తే ఎవరికి వారు క్యాన్సర్ నుండి దూరంగా ఉండవచ్చు.                                    *రూపశ్రీ.
  అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి.  ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా ఆలోచన చేస్తారు. అబ్బాయి ఉద్యోగం,  సొంతిల్లు ,  సంపాదన, ఆస్తిపాస్తులు,  అబ్బాయి అలవాట్లు.. ఇవి మాత్రమే కాకుండా కొందరు తల్లిదండ్రులు తమ కూతురిని తమకు ఎంత దగ్గర ప్రాంతంలో వీలైతే అంత దగ్గరలో ఇవ్వాలని అనుకుంటారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం లేని అమ్మాయిల విషయంలో అయితే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.  కేవలం కొన్ని గంటలు ప్రయాణం చేయగానే ఒకరిని ఒకరు చేరుకునేట్టుగా ఉండే ప్రాంతాలకు ఇవ్వాలని ఆశిస్తారు.  దీని వెనుక చాలా విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. చేరుకోవడం తేలిక.. దగ్గరగా నివసించడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  ఒకరినొకరు కలవడానికి  అడ్డంకులు తక్కువగా ఉండటం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లిదండ్రులు కూతురిని చూడవచ్చు, కూతురు తల్లిదండ్రుల వద్దకు వెళ్లవచ్చు. చిన్న,  పెద్ద సమస్యలు,  అపార్థాలను వెంటనే పరిష్కరించవచ్చు. ఇది సంబంధంలో పారదర్శకతను తెస్తుంది,  పరస్పర విశ్వాసాన్ని బలపరుస్తుంది. దగ్గరగా ఉండటం వల్ల, రెండు కుటుంబాలు ఒకరి మనస్తత్వాన్ని,  వారి అవసరాలను సులభంగా అర్థం చేసుకోగలవు, ఇది సంబంధంలో సామరస్యాన్ని పెంచుతుంది. సమయం, ఖర్చు.. కూతురిని దూరంగా ఇచ్చినప్పుడు ఆమెను చూసి రావడానికి  తరచుగా ఎక్కువ సమయం,  డబ్బు ఖర్చవుతుంది.  ప్రయాణాలు, ఫోన్ కాల్స్,వాహన సదుపాయం మాత్రమే కాకుండా  ప్రయాణానికే ఉన్న సమయం అంతా గడిపోతుంటుంది. దీని  వల్ల సంబంధాలకు సమయం కేటాయించడంలో ఒత్తిడిని కలిగిస్తుంది. దగ్గర ఉన్న సంబంధాలకు ఇాలాంటి సమస్యలు ఉండవు.  చిన్న చిన్న పండుగలు,శుభ సందర్భాలను కూడా  కుటుంబంతో పంచుకోవచ్చు. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది. అంతేకాదు.. ఆర్థిక, మానసకి భారాన్ని తగ్గిస్తుంది. వాతావరణం.. దగ్గరి ప్రాంతంలోనే అమ్మాయిని ఇవ్వడం వల్ల ప్రాంతీయత, అలవాట్ల సమస్య ఉండదు. ఆహారపు అలవాట్లు,  పద్దతులు కూడా తెలిసి ఉంటాయి.  ఇది మనుషుల్లో కలిసిపోవడానికి బాగా సహాయపడుతుంది. సామాజిక-సాంస్కృతిక నేపథ్యంలో పెద్దగా తేడా లేకపోతే, రెండు కుటుంబాలకు ఒకరితో ఒకరు సర్దుకుపోవడంలో ఎటువంటి సమస్య ఉండదు. ఈ ఉమ్మడి పునాది సంబంధాన్ని దీర్ఘకాలికంగా స్థిరంగా,  బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల ఇల్లు,  అత్తమామల ఇల్లు కొన్ని మైళ్ల దూరంలో ఉన్నప్పుడు,  పిల్లలను పెంచడంలో మంచి సపోర్ట్ లభిస్తుంది.  ఉద్యోగం కారణంగా నేటి కాలంలో వారు పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే దగ్గరలోనే రెండు కుటుంబాలు ఉంటే పిల్లల విషయంలో మంచి సపోర్ట్ దొరుకుతుంది. పిల్లలకు రెండు కుటుంబాల  ప్రేమ,  మద్దతు కూడా లభిస్తుంది. ప్రతికూలతలు.. కుటుంబాలు దగ్గరలో ఉండటం వల్ల ప్రయోజనాలే కాదు.. ప్రతికూలతలు కూడా ఉంచాయి.  రెండు కుటుంబాలు ఆరోగ్యకరమైనవి అయితే సమస్య లేదు. కానీ కేవలం అమ్మాయి మాత్రమే కావాలని, ఆమె తల్లిదండ్రులు వారి కుటుంబం మాకు అవసరం లేదని అనుకునే అత్తింటి వారితో ఇలా దగ్గరగా ఉండటం వల్ల అటు ఆడపిల్ల తల్లిదండ్రులు,  ఆ అమ్మాయి కూడా చాలా బాధపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు దగ్గర  ఉంటే ఏ చిన్న గొడవ జరిగినా ఆడపిల్ల తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడుతుంది.  ఇది అత్తింటితో అనుబంధాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఆడపిల్ల తల్లిదండ్రులు తమ కూతురు అల్లుడి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం,   ఆడపిల్లకు చెడు మాటలు నేర్పి  కుటుంబాన్ని విచ్చిన్నం చేసే దిశగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది.  కాబట్టి ఇది వారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అయితే.. దూరం సంబంధం అయినా, దగ్గరి సంబందం అయినా..  రెండు కుటుంబాలు  ఆరోగ్యకరంగా ఉండే విదానం మీదనే సంబంధాలు నిలబడతాయి, సంతోషంగా ఉంటాయి.                                   *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.