LATEST NEWS
  బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ తరఫున సంస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ప్రాతినిధ్యం వహించే బాధ్యతలను మహ్మద్ ముబీన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన AIMIM పార్టీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు మహ్మద్ ముబీన్‌తో సమన్వయం చేసుకుంటూ పార్టీ సంస్థాగత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ సూచించింది. నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరపాలని పేర్కొంది. ముబీన్‌కు అప్పగించిన కొత్త బాధ్యతలతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.   MLA Mohammed Mubeen, Rajendranagar  MIM in-charge, AIMIM, Asaduddin Owaisi,  MLC Rahmat Beg, Telugu news, Telugu one 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి అత్యంత బలమైన అనుకూల ప్రాంతంగా ఉంటూ వచ్చిన రాయలసీమలో 2024 ఎన్నికలలో ఆ పార్టీ దెబ్బతింది.  ముఖ్యంగా వైసీపీకి కొండంత అండగా నిలుస్తూ, ఆ పార్టీకి పెట్టని కోట లాంటి కడన జిల్లాలో కూడా వైసీపీ వెనుక బడింది. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని  మొత్తం పది అసెంబ్లీ స్ధానాలలో ఏడింటిని తెలుగుదేశం కూటమి కైవశం చసుకుంది.  ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వైపీనీ కడప లోక్ సభ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోగలిగింది.  అయితే ఇండియా టుడే ,  సి-వోటర్ సంయుక్తంగా నిర్వహించిన తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు కడప లోక్ సభ స్థానానికి జగన్, ఆయన పార్టీ తిలోదకాలొదిలేయడం ఖాయమని పేర్కొంది.  ఏపీలో ఇప్పుడు గనక  ఎన్నికలు జరిగితే వైసీపీ  కడప పార్లమెంట్ స్థానంలో సైతం పరాజయం పాలౌతుందని సర్వే పేర్కొంది.  ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 4 ఎంపీ స్థానాల సంఖ్య మరో స్థానం పెరిగి 5 కి చేరుకునే అవకాశం ఉందదని సర్వే పేర్కొన్నప్పటికీ, వైసీపీ కంచుకోట అయిన కడపలో ఓటమి మూటకట్టుకోవడం ఖాయమని ఇండియాటుడే సర్వే పేర్కింది,   {India Today survey, Kadapa MP seat, YCP Kadapa Lok Sabha, India Today C Voter AP survey, TDP AP Lok Sabha seats,  AP politics news, Telugu One}
వైసీపీ లో క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్లు కేవలం ప్రజాక్షేత్రంలో పరువు కాపాడుకోవడానికి వేసే ఉత్తుత్తి డ్రామాలు మాత్రమేనని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.  పార్టీకీ, పార్టీ ప్రతిష్ఠకు తీరని నష్టం జరిగే వివాదాలలో, ఆరోపణలలో నాయకులు చిక్కుకున్నప్పుడు మాత్రమే.. ప్రజాగ్రహం నుంచి దృష్టి మళ్లించడానికి కంటి తుడుపు చర్యగా వైసీపీలో సస్పెన్షన్లు ఉంటాయని అంటున్నారు. పేరుకే సస్పెన్షన్ తప్ప ఆ నేతలకు పార్టీలో ఉన్న స్థానం, వారి హోదాలు అలాగే కొనసాగుతుంటాయి. ఇందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీలు అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్ ల ఉదంతాలే నిలువెత్తు నిదర్శనం అని చెబుతున్నారు.   అనంతబాబు విషయానికి వస్తే... తన వద్ద కారు డ్రైవర్ గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో హతమైతే, అతడి మృతదేహాన్ని తన సొంత కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేశారు ఎమ్మెల్సీఅనంతబాబు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు బెయిలుపై బయట తిరుగుతున్నారు అది వేరే సంగతి. కాగా మృతదేహం డోర్ డెలివరీ విషయంలో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోవైసీపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే పార్టీ నుంచి సస్పెండైనా ఆయన జగన్ పర్యటనల్లో, పార్టీ సమావేశాలలో యాక్టివ్ గా తిరుగుతూనే ఉన్నారు.  ఒక హత్య కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై శాశ్వత బహిష్కరణ లేదా శాసనమండలి సభ్యత్వ రద్దు దిశగా వైసీపీ ఎటువంటి చర్యా తీసుకోలేదు. కేవలం సస్పెన్షన్ ప్రకటనతో సరిపెట్టి చేతులు దులుపుకుంది.  ఇక దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఆయన సస్పెన్షన్ కూడా ఉత్తుత్తిదే అని పరిశీలకులు అంటున్నారు.  దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు. ఇటీవల శాసనమండలిలో వైసీపీ పక్ష సభ్యుడిగా చర్చల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలతో మరో సారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు.  ఇలా ఉత్తుత్తి సస్పెన్షన్లతో వైసీపీ ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతోందని పరిశీలకులు అంటున్నారు.  {Token Gesture Suspenssions in YCP, MLC Anantha Babu, Duvvada Srinivas}
ALSO ON TELUGUONE N E W S
కన్నడ చిత్రసీమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రారాజు, రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకులను, విమర్శకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా సంచలన వసూళ్లను సాధిస్తోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, భారతదేశంలో దాదాపు ₹200 కోట్లకు సమీపంలో నిలిచింది. ఒకవైపు బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తూనే, మరోవైపు ఈ చిత్రం భిన్నమైన కథాంశం మరియు నటీనటుల ప్రదర్శనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలను కూడా మూటగట్టుకుంటోంది. సాధారణ వాణిజ్య సినిమాల రూట్‌కు భిన్నంగా, గిల్ట్ మరియు మనుషుల అంతరంగంలోని టాక్సిసిటీ చుట్టూ తిరిగే ఈ భిన్నమైన కథాంశంపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తున్న తరుణంలో, 'కాంతార' ఫేమ్, నేషనల్ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రిషబ్ శెట్టి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా యష్ మరియు దర్శకనిర్మాతలను ప్రశంసిస్తూ ఒక భావోద్వేగపూరితమైన నోట్‌ను షేర్ చేశారు. ఒక నటుడిగా పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేయడం ఎంత కష్టమో వివరించిన రిషబ్, యష్ ఈ సినిమాలో చేసిన సాహసాన్ని కొనియాడారు. "ఒక కళాకారుడిగా ఒక పాత్రను పోషిస్తున్నప్పుడు, దానికి ప్రాణం పోయడానికి హృదయాంతరాల నుండి ప్రయత్నిస్తాం. ఒక శక్తివంతమైన వ్యక్తి యొక్క అంతరంగ పోరాటాన్ని, ఆవేదనను యష్ అద్భుతమైన విశ్వాసంతో తెరపై ఆవిష్కరించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది" అని రిషబ్ పేర్కొన్నారు. సాధారణంగా బాక్సాఫీస్ మాస్ సినిమాలు వెళ్లే రెగ్యులర్ ట్రాక్‌లో కాకుండా, ఒక భిన్నమైన కథనాన్ని ఎంచుకోవడం తప్పు కాదని ఆయన స్పష్టం చేశారు. ఒక ఆలోచన మనస్సులో పుట్టినప్పటి నుండి, అది తెరపై సినిమాగా రూపుదిద్దుకునే వరకు జరిగే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ పడే కష్టం చాలా గొప్పదని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలో యష్ డ్యూయల్ రోల్స్ (రాయ్ మరియు రుమి అలియాస్ టికెట్) లో లీనమై నటించిన తీరును రిషబ్ శెట్టి ప్రత్యేకంగా కొనియాడారు. లార్జర్ ద్యాన్ లైఫ్ పాత్రకు తగ్గట్టుగా, ఆ విభిన్నమైన ప్రపంచానికి యష్ తనను తాను పూర్తిగా సమర్పించుకున్న తీరుకు హ్యాట్సాఫ్ అని తెలిపారు. జీవితంలో నేరం మరియు అనుమానం, నేరభావన (గిల్ట్) అనేది మనిషిలో ఎలా పెరుగుతూ పోతుందో, దానివల్ల జీవితంలో విషపూరితమైన వాతావరణం (టాక్సిసిటీ) ఎలా పెరుగుతుందో ప్రేక్షకులకు అనుభవపూర్వకంగా చూపించడం చాలా కష్టమైన విషయమని, అటువంటి సాహసోపేతమైన ప్రయోగానికి పూనుకున్నందుకు తాను యష్‌తో పాటుగా నిలబడతానని రిషబ్ చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, కన్నడ సినిమా స్థాయిని, ఖ్యాతిని అంతర్జాతీయ రంగానికి తీసుకెళ్లడంలో యష్ చూపిస్తున్న అంకితభావం మరియు ప్రేమను తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని చెప్పారు. ఈ చిత్ర దర్శకురాలు గీతు మోహన్‌దాస్, నిర్మాత వెంకట్ కె నారాయణ మరియు కెవిఎన్ ప్రొడక్షన్స్ బృందానికి కూడా రిషబ్ శెట్టి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై రిషబ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడతో పాటు సౌత్ సినీ పరిశ్రమ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.     [Yash Toxic Movie, Rishab Shetty Praise Yash, Toxic Box Office Collection, Toxic Movie Review Telugu, Yash Geetu Mohandas, KVN Productions]
శబరిమల అయ్యప్ప స్వామి నేపథ్యంతో తెరకెక్కుతున్న లేటెస్ట్ డివోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ 'హరివరాసనం' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన నూతన షెడ్యూల్ పంబ మరియు నిలక్కల్ ప్రాంతాలలో ప్రారంభమైంది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. రాజేష్ నాయర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో తమిళ పాపులర్ కమెడియన్ యోగి బాబు, వర్సటైల్ నటుడు షైజు కురుప్ మరియు సంపత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా పంబ లోయలు, నిలక్కల్ అటవీ ప్రాంతాల్లోని సహజసిద్ధమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అటవీ శాఖ మరియు సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతులు పొందిన చిత్రయూనిట్, అన్ని నిబంధనలను పాటిస్తూ చిత్రీకరణ కొనసాగిస్తోంది. ప్రారంభంలో అనుమతుల విషయమై చిన్నపాటి అయోమయం నెలకొన్నప్పటికీ, అధికారులు మరియు ప్రొడక్షన్ టీమ్ చర్చల అనంతరం షూటింగ్‌ను సాఫీగా సాగిస్తున్నారు. ఈ చిత్రానికి డాక్టర్ అంబాడి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, అయ్యప్ప స్వామి భక్తి భావనలు మరియు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో కథను మలచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల రోజులకు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తాజా షెడ్యూల్‌తో ప్రధాన ఘట్టాల చిత్రీకరణను ముగించనుంది. యోగి బాబు తన నటనతో అటు తమిళంతో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోగా, షైజు కురుప్ తనదైన శైలిలో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై సౌత్ సినీ ప్రియుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా శబరిమల లొకేషన్లలో జరుగుతున్న ఈ షూటింగ్ విశేషాలు వైరల్ అవుతున్నాయి. అయ్యప్ప స్వామికి అత్యంత ప్రియమైన 'హరివరాసనం' శీర్షికతో వస్తుండటంతో భక్తులు మరియు సినీ ప్రేక్షకులు ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది.
తెలుగు సినీ రంగానికి చెందిన డాన్స్ యూనియన్‌లో ఒక ఆసక్తికరమైన మరియూ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ పేరును సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూనియన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా డ్యాన్సర్స్ యూనియన్‌లో సభ్యుల సంక్షేమం, వేతనాలు, అలాగే వర్కింగ్ కండిషన్స్‌కి సంబంధించి పలు అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో పరిశ్రమలోని సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న రఘు మాస్టర్ అయితే యూనియన్‌ను సరైన బాటలో నడిపించగలరని మెజారిటీ డ్యాన్సర్లు భావిస్తున్నారు. అందుకే ఆయనను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. రియాలిటీ డ్యాన్స్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ పాటలకు అద్భుతమైన స్టెప్పులు సమకూర్చిన రఘు మాస్టర్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అగ్ర హీరోల సినిమాలతో పాటు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లకు కొరియోగ్రఫీ చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన, టెలివిజన్ రంగంలోనూ న్యాయ నిర్ణేతగా అలరించారు. యూనియన్‌లోని సీనియర్ మరియు జూనియర్ డ్యాన్సర్లతో మంచి అనుబంధం కలిగిన రఘు మాస్టర్, ఎల్లప్పుడూ వారి సమస్యల పరిష్కారానికి ముందుంటారనే పేరుంది. ఈ కారణంగానే ఆయనకు అధ్యక్ష పీఠం అప్పగించేందుకు యూనియన్ వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా వెలువడిన ఈ వార్తలపై ఇటు సినీ వర్గాల్లోనూ, అటు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రఘు మాస్టర్ ఈ బాధ్యతలను స్వీకరిస్తే యూనియన్‌కు సరికొత్త ఊపు వస్తుందని డ్యాన్సర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనపై రఘు మాస్టర్ త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించి యూనియన్ ఎన్నికలు లేదా ఏకగ్రీవ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.       [Raghu Master, Telugu Film Dancers Union, Choreographer Raghu Master, Tollywood Dance Masters, TeluguOne TMDB]
టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 100వ చిత్రం 'కింగ్ 100' ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్ మూవీకి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన స్వల్ప వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై విధ్వంసం సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ గ్లింప్స్ విడుదలైన కొద్ది గంటల్లోనే 8 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. 'The REIGN continues to grow. The KING continues to rule' అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ వీడియోలో నాగార్జున వింటేజ్ కింగ్ లుక్‌లో అదరగొట్టారు. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, నాగ్ బాడీ లాంగ్వేజ్ అక్కినేని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గ్లింప్స్ చివర్లో 'లాంగ్ లివ్ ది కింగ్' అంటూ వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మైలురాయి చిత్రానికి కోలీవుడ్ విలక్షణ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాకుండా నాగార్జున సరసన సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ క్రేజీ కాంబినేషన్ చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు టీ-సిరీస్ సౌత్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున సినీ ప్రస్థానంలోనే ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నాగార్జునకు అభిమానులు ఎంతో ఇష్టంగా పిలుచుకునే 'కింగ్' పేరుతోనే 100వ సినిమా రావడం విశేషం. గ్లింప్స్‌కి వచ్చిన ఈ రికార్డు స్థాయి స్పందనతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర ఆనందంలో ఉన్నారు. నెట్టింట 'కింగ్ 100' హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఈ క్రేజీ మూవీ విడుదల తేదీపై కూడా చిత్రబృందం స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది చివరిలో 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ పండుగ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గ్లింప్స్‌తోనే ఈ స్థాయి సంచలనం సృష్టించిన నాగార్జున, థియేటర్లలో ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.     [Nagarjuna King 100, Akkineni Nagarjuna 100th film, King 100 Glimpse Views, R Karthik, TeluguOne TMDB]
స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో ఎవరు అనేది నిన్నటిదాకా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ సస్పెన్స్ కు తెర దించుతూ మేకర్స్ ఆ యంగ్ హీరో ఎవరు ?, ఆయన సినిమా ఏంటి ? అనేది అనౌన్స్ చేశారు. స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్" అంటూ మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "టార్టాయిస్" సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. "టార్టాయిస్" సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తన్నారు. "టార్టాయిస్" సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో ఒక డెడ్ బాడీ పక్కన హీరో రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని ఉండటం, ఆయన పక్కనే ఒక కత్తి పడి ఉండటం ఆసక్తి రేపుతోంది. రాజ్ తరుణ్ తన కెరీర్ లో ఇప్పటిదాకా చేయని ఒక కొత్త తరహా ఇంటెన్స్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ తో తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. నటీనటులు - రాజ్ తరుణ్, అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, షిజు ఏఆర్, రవి కాలె, మొయిన్, తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్ - బెమనొల శ్రీకాంత్, కొరియోగ్రఫీ - రాజ్ కృష్ణ, వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ - దేవర మధుకర్, ఎడిటర్ - గుళ్లపల్లి మాధవ్ కుమార్, డీవోపీ - శబరి విగ్నేష్, మ్యూజిక్ - అనూప్ రూబెన్స్, కో ప్రొడ్యూసర్స్ - మానస కుమార్, సంతోష్ ఇమ్మడి, ప్రొడ్యూసర్స్ - విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రిత్విక్ కుమార్. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
ఇంట్లో ఇనా బయటకు వెళ్ళినప్పుడు అయినప్పుడు అయినా దాహం వేయగానే మొదట నీరు తాగుతారు. వర్షాకాలంలో అయితే బయటకు వెళ్ళినప్పుడు నీరు తాగడం తక్కువే అయినా ప్రయాణాల్లో, ఏదైనా ఆహారం తిన్నప్పుడో తప్పనిసరిగా కొన్నిసార్లు బయట నీరు తాగాల్సి వస్తుంది. వర్షాకాలంలో దాహం వేసినప్పుడు బయట దొరికే నీటిని తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు నీటి ద్వారా వేగంగా వ్యాపిస్తాయి. అందువల్ల ఈ కాలంలో తాగే నీటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో బయటి నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే.. మురుగు నీరు కలవడం.. వర్షాల వల్ల బయట డ్రైనేజీ వ్యవస్థలు పొంగిపొర్లుతాయి. పైప్‌లైన్లలో లీకేజీల వల్ల తాగునీటిలో మురుగు నీరు కలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బయట హోటళ్లు, రోడ్డు పక్కన బండ్ల వద్ద ఇచ్చే నీరు ఇలా కలుషితమైనదే అయి ఉండవచ్చు. ప్రమాదకర వ్యాధులు.. కలుషిత నీటిని తాగడం వల్ల కలరా, టైఫాయిడ్, కామెర్లుగా పిలుచుకునే  జాండీస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, విరేచనాలు వంటి నీటి ద్వారా వ్యాపించే తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఐస్ క్యూబ్స్ తో జాగ్రత్త..  చాలామంది బయట పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేయించుకుంటారు. కానీ ఆ ఐస్ తయారీకి ఏ నీటిని వాడారో తెలియదు. తరచుగా పరిశుభ్రంగా లేని నీటితోనే ఐస్ తయారు చేస్తారు కాబట్టి బయట తాగే పానీయాల్లో ఐస్ తీసుకోకపోవడమే మంచిది. ఫిల్టర్ నీరు అని నమ్మకండి.. బయట బోర్డు మీద ఫిల్టర్ వాటర్ అని రాసి ఉన్నంత మాత్రాన అది పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. నీటిని శుభ్రం చేసే యంత్రాల నిర్వహణ సరిగ్గా లేకపోయినా అందులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ ఇంట్లో కాచి చల్లార్చిన నీటిని  బాటిల్ లో వెంట తీసుకెళ్లడం చాలా మంచిది.  ఒకవేళ బయట నీరు తాగాల్సి వస్తే, నాణ్యమైన సీల్ చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. 10,20 ఖర్చు ఎందుకని ఎక్కడంటే అక్కడ నీరు తాగితే.. ఆ తర్వాత హాస్పిటల్స్ కోసం వందలు, వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వాటర్ బాటిల్ వన్ ముందు.. బాటిల్ సీల్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. హోటళ్ళు లేదా రెస్టారెంట్లలో నీరు తాగాల్సి వస్తే వేడి నీటిని ఇమ్మని అడగడం మంచిది. వర్షాకాలంలో ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ఆసుపత్రి పాలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి బయట దొరికే సాధారణ నీటిని తాగే పొరపాటు అస్సలు చేయకూడదు.                      *రూపశ్రీ.
జ్ఞానాన్ని సేకరించండి.. అదే మీ అసలైన ఆయుధం..! మనిషి జీవితంలో సంపద కంటే విలువైనది జ్ఞానం. చాణక్య నీతి ప్రకారం జ్ఞానం మనకు ఎప్పటికీ తోడుగా ఉండే శక్తివంతమైన ఆయుధం. సంపదను కోల్పోవచ్చు, కానీ మనం సంపాదించిన జ్ఞానాన్ని ఎవరూ దోచుకోలేరు. అందుకే ప్రతి ఒక్కరూ జీవితాంతం జ్ఞానాన్ని సేకరిస్తూనే ఉండాలి. మనం చదివే ప్రతి పుస్తకం, తెలుసుకునే ప్రతి కొత్త విషయం మన ఆలోచనా శక్తిని పెంచుతుంది. అలాగే మనం ఎదుర్కొనే ప్రతి అనుభవం కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఇతరులు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడం ద్వారా కూడా మన జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను చూసి భయపడడు, వాటికి కారణాలను అర్థం చేసుకుని సరైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తాడు. అందుకే జ్ఞానవంతుడికి కష్టాలు కూడా అవకాశాలుగా మారతాయి. కేవలం పుస్తకాలు చదవడమే జ్ఞానం కాదు, నేర్చుకున్న విషయాలను జీవితంలో ఆచరించడం కూడా ఎంతో ముఖ్యం. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి మనలో ఉండాలి. ప్రశ్నించడం, పరిశీలించడం, ఆలోచించడం ద్వారా జ్ఞానం మరింత పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ మనలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తిని జ్ఞానం అందిస్తుంది. కష్టకాలంలో మనకు సరైన దారి చూపించేది కూడా జ్ఞానమే. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. మనం సంపాదించిన జ్ఞానం మన జీవితంలో ఎన్నో సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. చాణక్యుడు చెప్పినట్లుగా, జ్ఞానం ఉన్న వ్యక్తిని పరిస్థితులు సులభంగా ఓడించలేవు. కాబట్టి ప్రతి రోజూ జ్ఞానాన్ని సేకరించండి, దాన్ని ఆచరణలో పెట్టండి. ఎందుకంటే మన దగ్గర ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే, జీవితంలో మనం అంత బలమైన ఆయుధాన్ని కలిగి ఉన్నట్టే.  
ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం అనేది అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లేదా ఫిట్‌నెస్‌ సాధించడానికి చాలామంది మహిళలు సరదాగా ఆడే సోషల్ స్పోర్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ, దీర్ఘకాలంగా శారీరక శ్రమకు దూరంగా ఉండి ఒక్కసారిగా ఆటల మైదానంలోకి అడుగుపెట్టే మహిళలకు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గాయాలు, నొప్పులు వారి క్రీడా భాగస్వామ్యానికి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయని ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన నూతన అధ్యయనం స్పష్టం చేస్తోంది. జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ ఇన్ స్పోర్ట్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం, సోషల్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనే శారీరక శ్రమ లేని ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు (20.8 శాతం మంది) గాయాలు లేదా తీవ్రమైన నొప్పుల వల్ల తమ ఆటను సరిగ్గా కొనసాగించలేకపోతున్నారు.లా ట్రోబ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్పోర్ట్ అండ్ సోషల్ ఇంపాక్ట్‌కు చెందిన పరిశోధకురాలు కీరా స్టాలే నాయకత్వంలో విక్టోరియా పరిధిలోని 1,339 మంది శారీరక శ్రమ లేని మహిళలపై ఈ విస్తృత సర్వే నిర్వహించారు. వారంలో కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయని వారిని శారీరక శ్రమ లేని వారిగా పరిగణించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్రతి 10 మంది పెద్దలలో దాదాపు 8 మంది కనీస వ్యాయామ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళలే మరింత వెనుకబడి ఉన్నారు. కుటుంబ బాధ్యతలు, సమయాభావం, ఆర్థిక పరిమితులు మరియు తగిన క్రీడా వసతులు లేకపోవడం వల్ల మహిళల్లో శారీరక శ్రమ లోపిస్తోంది. ఈ క్రమంలో వారు సోషల్ స్పోర్ట్స్‌లో చేరినప్పుడు, శరీరం ఒక్కసారిగా ఆ ఒత్తిడిని తట్టుకోలేక గాయాల బారిన పడుతోందని ఈ డేటా చెబుతోంది. ఈ అధ్యయనంలో వ్యక్తమైన మరో సంచలనాత్మక విషయం ఏమిటంటే, శరీరంలో కొన్ని నిర్దిష్ట భాగాలు మాత్రమే ఎక్కువగా ఈ గాయాలకు గురవుతున్నాయి. గాయాల పాలైన మహిళల్లో అత్యధికంగా 39 శాతం మంది మోకాలి నొప్పులు లేదా గాయాలతో బాధపడుతుండగా, 29.9 శాతం మంది నడుము కింద భాగంలో నొప్పితో, మరో 24.7 శాతం మంది మడమల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, ఈ గాయాల బారిన పడటంలో ఆర్థిక అసమానతలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని పరిశోధన ఆధార సహితంగా వెల్లడించింది. సంవత్సరానికి లక్ష డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలు, రెండు లక్షల డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల మహిళలతో పోలిస్తే గాయాల పాలయ్యే అవకాశం మూడు రెట్లు (1.84 నుండి 3.28 రెట్ల ఎక్కువ అవకాశం) ఎక్కువగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.       inactive women fitness injury risks,social sports health hurdles women.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.