LATEST NEWS
  క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి  సెంటిమెంట్లు బాగా  ఎక్కువ‌. ఎందుకంటే  ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి  సెంటిమెంట్ల  ద్వారా. అలా త‌న తండ్రి  తెలంగాణ  రాష్ట్ర స‌మితి అనే పార్టీని ఏప్రిల్ 27, 2001లో స్థాపించ‌గా.. కూతురు క‌విత, పాతికేళ్ల త‌ర్వాత‌.. అంటే 2026, ఏప్రిల్ 25న పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సుముహుర్తం ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.ఇంత‌కీ ఈ పార్టీ పేరు ఏమై ఉంటుంది? అంటే, తెలంగాణ ప్రజా జాగృతి అని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమె తెలంగాణ  జాగృతి అనే సామాజిక సంస్థ‌ను న‌డుపుతున్నారు. దీనికే ప్ర‌జా అనే ప‌దం  చేర్చుతూ దాన్ని రాజ‌కీయ పార్టీగా మార్చుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.   ఇక పార్టీ గుర్తులు ఏవి ఉంటాయో ప‌రిశీలిస్తే.. ధ‌ర్మ గంటను ఖ‌రారు చేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. జెండా, అజెండా  ఎలాంటివో గ‌మ‌నిస్తే ఇప్ప‌టికే జాగ్ర‌త్తికంటూ తెలుపు, లేత ప‌చ్చతో కూడిన జెండా రంగులున్నాయి. వీటికి అజెండాను జోడిస్తే.. సామాజిక తెలంగాణ లేదా తెలంగాణ  ఫ‌స్ట్.. ఆమె తీసుకున్న రాజ‌కీయ విధానంగా స‌మాచారం.  ఇక యువ‌త‌, మ‌హిళ‌లు, అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కులు, మ‌రీ ముఖ్యంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు అండ‌గా నిల‌బ‌డ్డం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక బీసీ  సంగ‌తి స‌రే స‌రి. మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల‌పై పోరాటం కూడా ఆమె తీసుకుంటున్న పొలిటిక‌ల్ లైన్ల‌లో భాగ‌మే.  వ‌చ్చే ఎన్నిక‌ల  నాటికి డీలిమిటేష‌న్లో భాగంగా తెలంగాణ నియోజ‌క‌వ‌ర్గాలు సైతం పెర‌గ‌నుండ‌టంతో ఆమె పార్టీ నుంచి కూడా ఎంద‌రో కొత్త రాజ‌కీయ నాయ‌కులు పుట్టుకొచ్చేలా  తెలుస్తోంది.ఇక ఏప్రిల్ 25న ఎందుకు? ఈ ముహుర్తం  ఖ‌రారు చేయ‌డం వెనక ఉన్న ఉద్దేశ‌మేంటో ప‌రిశీలిస్తే.. కొన్ని జ్యోతిష శాస్త్ర ప‌ర‌మైన అంశాలు ఇందులో దాగి  ఉన్నట్టు స‌మాచారం. ఏప్రిల్ ఇర‌వై ఐదున రాజ‌యోగాన్నిచ్చే గ్ర‌హ‌గ‌తుల సంచారం  క‌నిపిస్తోందని అంటారు పండితులు. కొత్త  ప‌నులు ప్రారంభించ‌డానికి  ఇది సుదినంగా  చెబుతున్నారు.  దానికి తోడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వానికి కూడా ఈ తేదీతో కొంత సంబంధ‌ముంది. పాతికేళ్ల క్రితం కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్రారంభించారు క‌విత తండ్రి కేసీఆర్. అదే తేదీకి అటు ఇటుగా తెలంగాణ ప్ర‌జా జాగృతి ప్రారంభిస్తున్నారు కేసీఆర్ త‌న‌య‌ క‌విత‌. ఆ పార్టీ  ఆనాడు ఎంతగా ఎదిగిందో, త‌న పార్టీ  కూడా అంతేలా  ఎదుగుతుంద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు క‌విత‌. ఉగాది త‌ర్వాత వ‌చ్చే శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల అనంత‌రం త‌న పార్టీ  జెండా ఎగుర‌వేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌వ‌చ్చ‌న్న  న‌మ్మ‌కాలు కూడా క‌విత‌కు ఉన్న‌ట్టు స‌మాచారం.  బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు అన్యాయం జ‌రిగింది. అలాంటి వారికి త‌మ పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాన‌ని అంటున్నారు క‌విత‌. ఇక చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా సాధికార‌త‌ను తీసుకొచ్చేలా 33 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు కూడా ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ప్ర‌త్యేకించీ యువ‌త కోసం ఉద్యోగ నోటిఫికేష‌న్లు.. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం కూడా క‌విత త‌న విధానంగా  చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌విత  పార్టీ ఎఫెక్ట్ ఎంత‌?  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి దీటుగా ఆమె పార్టీ టీపీజే  ఎదిగే అవ‌కాశం ఎంత‌? ద‌క్షిణాది నుంచి జ‌య త‌ర్వాత ఆ స్థాయిలో ఒక మ‌హిళ‌గా ఆమె రాజ‌కీయంగా ఎదిగి సీఎం కాగ‌ల‌రా?  తేలాల్సి ఉంది.
  తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా పార్టీగా నామకరణం చేసిన నూతన పార్టీని ఏప్రిల్ 25 తేదీన ఉదయం 10గం.లకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్‌లోని మునిరాబాద్‌లో పార్టీ ప్రకటిస్తానని, అదే రోజు పార్టీ జెండా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తం ఉందన్నారు.  రాముని ఆశీర్వాదంతో పార్టీ ప్రకటన తేదీని నిర్ణయించామని ముహుర్తాలపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. వారణాసి వెళ్లి గంగా స్నానం చేసి పార్టీ నీ లంచ్ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు స్పష్టం చేశారు.  వాస్తవానికి ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందు పార్టీని, జెండాను ఆవిష్కరించనున్నట్లు కవిత ప్రకటించడం విశేషం. ఏఏ అంశాలపై కొత్త పార్టీ పోరాటం చేయాలో తమ దృష్టికి తీసుకురావాలని కవిత శ్రీరామ నవమి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందంటున్న కవిత, తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత  ఉద్యోగాల కోసం వేచి చూడాల్సి వస్తోందని పరోక్షంగా బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.  తమ కొత్తపార్టీ ద్వారా యువత కోసం ఏం చేయబోతున్నామో చెబుతామని. యువత, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కవిత వెల్లడించారు.  జాగృతి సంస్థ ద్వారా బీసీలు, దళితుల హక్కుల కోసం పోరాటం చేశామని,  పార్టీ ఆవిర్భావం నాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు,యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత కోరారు.  మొత్తానికి తెలంగాణ జాగృతి సంస్ధ...రాజకీయ పార్టీగా మారబోతుందిప్పుడు. తమ పార్టీ ఎవరికీ బీ పార్టీ కాదని ....తమది నెంబర్ వన్ పార్టీగా ఉండబోతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. కొత్త పార్గీ నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో సలహాలు ఇవ్వాలని ,   అందుకోసం ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేస్తామని, అలాగే మెయిల్‌కి మేసేజ్ చేయవచ్చన్నారు. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత,  అప్పటిలోగా.. అంటే రానున్న 28 రోజుల్లో ప్రతి ఒక్కరినీ కలుస్తానని ప్రకటించారు.. తెలంగాణ ఉద్యమకారులు, యువత, మహిళలు, మెథావులు, కవులు, పాత్రికేయులు అందరితో చర్చిస్తామన్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్రగడ పద్మనాభరెడ్డితో భేటీ అయ్యారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం కిర్లంపూడి చేరుకున్న అంబటి నేరుగా ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో  రాజకీయ పరిస్థితులపై వారిరువురూ చర్చించారని తెలుస్తోంది. భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.   అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఈ సందర్భంగా అంబటి విమర్శలు గుప్పించారు.   గతంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులు ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో అలాగే ఇప్పుడు వైసీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీరును  తప్పుపట్టిన అంబటి రాంబాబు.. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు తగ్గేదేలే అంటూ పుష్పసినిమా స్టైల్ లో చెప్పారు.   వైఎస్సార్సీపీ తరపున, తన సామాజికవర్గం తరపున పోరాడుతూనే ఉంటానన్నారు. ప్రభుత్వ అణిచివేత ధోరణిని ప్రజలంతా గమనిస్తున్నారని అంబటి రాంబాబు చెప్పారు.   
ALSO ON TELUGUONE N E W S
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్-2' హవా కొనసాగుతోంది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల తాకిడి లేదు. చిన్న సినిమాలే విడుదలయ్యాయి. దాదాపు ఆ సినిమాలన్నీ పరవాలేదనే టాక్ కే పరిమితమయ్యాయి. ఈ వారం బ్యాండ్ మేళం, సుయోధనతో పాటు డబ్బింగ్ సినిమాలు యూత్, హ్యాపీ రాజ్ థియేటర్లలో అడుగుపెట్టాయి. వీటిలో సుయోధన సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, మిగతా మూడు సినిమాలు రొమాంటిక్ డ్రామా జానర్ లోనే రూపొందడం విశేషం     ఓటీటీలో మాత్రం జానర్లలో పలు సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. ఓటీటీలో సందడి చేస్తున్న సినిమా/సిరీస్‌లు: హే బల్‌వంత్‌ (Hey Balwanth) - ZEE5: సుహాస్, నరేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కామెడీ డ్రామా మార్చి 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రి నడిపే బిజినెస్ వెనుక ఉన్న అసలు రహస్యం కొడుకుకు తెలిస్తే ఏం జరుగుతుందనేదే ఈ కథ. సంప్రదాయని సుప్పిణి సుద్దపూసని - ETV Win: శివాజీ, లయ జంటగా నటించిన ఈ క్రైమ్ కామెడీ డ్రామా మార్చి 26 నుండి అందుబాటులోకి వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ చాలా కాలం తర్వాత మళ్ళీ రిపీట్ కావడం విశేషం. ముత్తు అలియాస్ కాట్టాన్ (Muthu Alias Kaattan) - JioHotstar: విజయ్ సేతుపతి నటించిన ఈ పక్కా విలేజ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా మార్చి 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. డేర్ డెవిల్: బోర్న్ ఎగైన్ సీజన్ 2 - JioHotstar: మార్వెల్ ఫ్యాన్స్ కోసం ఈ పాపులర్ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. వలతు వశతే కల్లన్ (Manorama Max): ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మలయాళ డబ్బింగ్ మూవీ థ్రిల్లర్ లవర్స్ కు బెస్ట్ ఛాయిస్. రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ (Netflix): పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాణి ముఖర్జీ, మరోసారి శివానీ శివాజీ రాయ్ పాత్రలో ‘మర్దానీ 3’ తో అలరించేందుకు వచ్చేశారు. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మూడు నెలల కాలంలోనే 93 మంది అమ్మాయిలు మిస్ అయిన కేసును శివానీ ఎలా చేధించింది? హ్యూమన్ ట్రాఫికింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సాగుతుంది. షాహిద్ కపూర్ ‘ఓ రోమియో’ (Amazon Prime Video): షాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం ‘ఓ రోమియో’. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. 1990ల నాటి ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్‌లో షాహిద్ కపూర్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే మహిళగా త్రిప్తి డిమ్రి నటించింది.  మొత్తానికి ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడి ఉంటే, ఓటీటీలో మాత్రం పలు సినిమాలు, సిరీస్ లతో మెగా జాతర కనిపిస్తోంది. సస్పెన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా ప్రతి జానర్ లోనూ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.  
  -బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ చిత్రంతో బిజీ  -ఈ సారి రికార్డులు సృష్టించడమే లక్ష్యం  -బాలయ్య వీడియో వైరల్  గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna) అఖండ 2(Akhanda 2)తో ఆగిపోయిన రికార్డులని తిరిగి సెట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే గోపీచంద్ మలినేని(Gopinchand Malineni)మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. రీసెంట్ గా బాలకృష్ణ ఢిల్లీలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ' కార్యక్రమంలో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లోనే బాలకృష్ణ చేసిన ఒక పనితో బాలయ్య మనస్తత్వం ఎలా ఉంటుందో బయటపడింది. అభిమానులు అయితే మా బాలయ్య సీనియర్ నటీమణులకి ఇచ్చే గౌరవంతో మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారని కొనియాడుతున్నారు. మరి పూర్తి మ్యాటర్  ఏంటో చూద్దాం. బాలకృష్ణ ఈవెంట్ కి హాజరైన సమయంలో అలనాటి అందాల లెజండ్రీ నటీమణి హేమమాలిని గారు కూడా ఈవెంట్ ప్రాంగణంలోకి వచ్చారు. ఆ సమయంలో హేమ మాలిని గారిని బాలకృష్ణ చూసి ఆమె పాదాలకి నమస్కరించాడు. దీంతో హేమమాలిని(Hemamalini)గారు బాలకృష్ణని ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో లేటుగా అయినా బయటకొచ్చి లేటెస్ట్ గా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. Also read: Samantha: మహిళలంటే చిన్నచూపు, సమానత్వం లేదు..  క్షమాపణలు చెబుతున్నాం హేమమాలిని గారు బాలీవుడ్ ని 70 ,80 ,90 వ దశకంలో చెడుగుడు ఆడుకుంది. ఆమె అందానికి, అంతకంటే అందమైన పెర్ఫార్మ్ కి అభిమాని కానీ వాడు భారతీయ సినీ ప్రేమికుడే కాదనే టాక్ కూడా నడిచింది. మరి ఈ లెక్కన  బాలకృష్ణ కూడా అభిమాని అయ్యి ఉంటాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇదే ఈవెంట్ లో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని హేమామాలినితో పాటు ఆమె భర్త లెజెండ్రీ హీరో ధర్మేంద్ర కి కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.     
మలయాళ ఇండస్ట్రీలో ‘థ్రిల్లర్ సినిమాల కింగ్’గా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph). ముఖ్యంగా 'దృశ్యం' ఫ్రాంచైజ్ ఆయనకు నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆలాంటి జీతూ జోసెఫ్ నుంచి వచ్చిన మరో ఆసక్తికర క్రైమ్ థ్రిల్లర్ ‘వలతు వశతే కల్లన్’ (Valathu Vashathe Kallan).  బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జనవరి 30న థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేస్తోంది. ఈరోజు(మార్చి 27) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మనోరమ మాక్స్, లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. కథ ఏంటంటే.. ఆంటోనీ జేవియర్ (బిజు మీనన్) ఒక అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్. తన వృత్తిలో ఎన్నో అక్రమాలకు పాల్పడుతుంటాడు. మరోవైపు సామ్యూల్ జోసెఫ్ (జోజు జార్జ్) తన కూతురు ఐరీన్‌తో ఎంతో సంతోషంగా గడుపుతుంటాడు. అయితే ఒకరోజు ఐరీన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది, ఆ తర్వాత ఆమె శవమై కనిపిస్తుంది. ఈ కేసు ఆంటోనీ దగ్గరికి వస్తుంది, కానీ అతని ఇన్వెస్టిగేషన్ తీరుపై సామ్యూల్‌కు అనుమానం కలుగుతుంది. తన కూతురి మరణానికి ఆంటోనీకి ఏదో సంబంధం ఉందని భావించిన సామ్యూల్, అతన్ని చిక్కుల్లో పడేయడానికి ఒక పక్కా ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో ఆంటోనీ కొడుకు ఫిలిప్ (కె.ఆర్. గోకుల్) ఈ గొడవలోకి ఎలా వచ్చాడు? ఆంటోనీ తన కొడుకుని ఎలా కాపాడుకున్నాడు? అసలు సామ్యూల్ మరణానికి కారణమేంటి? అనేదే మిగిలిన కథ. జీతూ జోసెఫ్ మార్క్ సస్పెన్స్ జీతూ జోసెఫ్ అంటేనే స్క్రీన్‌ప్లే మ్యాజిక్. ‘దృశ్యం’ సిరీస్‌తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈ సినిమాలో కూడా ‘పేరెంటింగ్’ అనే పాయింట్‌ను థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు జోడించాడు. దీను థామస్ ఈలన్ అందించిన కథకు జీతూ జోసెఫ్ తనదైన శైలిలో మెరుగులు దిద్దాడు. ఒక తండ్రి తన బిడ్డ కోసం ఎంత దూరం వెళ్తాడు? ఒక తండ్రి తప్పులు తన బిడ్డ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అనే అంశాలను ఇందులో చర్చించారు. ఇక టాలెంటెడ్ యాక్టర్స్ బిజు మీనన్, జోజు జార్జ్ ఎదురు పడే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో లేనా, నిరంజన అనూప్, లియోనా లిషోయ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ‘ఆడుజీవితం’ సినిమాతో మెప్పించిన కె.ఆర్. గోకుల్ ఇందులో పోలీస్ ఆఫీసర్ కొడుకుగా నటించాడు. విష్ణు శ్యామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయింది.  క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి, ముఖ్యంగా ‘దృశ్యం’ తరహా మైండ్ గేమ్స్ ఆశించే వారికి ఈ వీకెండ్ లో ‘వలతు వశతే కల్లన్’ ఒక మంచి ఛాయిస్.  
    -సమంత స్పీచ్ వైరల్  -మన శక్తీ మనకి తెలియడం లేదు  -రాజ్ నిడిమోరు  ప్రస్తుతం ఏం చేస్తున్నాడు సినిమా అనే బలమైన ఆయుధం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్థానాన్ని పొందిన సమంత(Samantha)కొన్ని నెలల క్రితం దర్శకుడు 'రాజ్ నిడిమోరు'(Raj Nidimoru)ని పెళ్లి చేసుకొని లైఫ్ లో కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ తో జీవితం బాగుందని ఇప్పటికే చాలా సార్లు వెల్లడి చేసిన సమంత రీసెంట్ గా సినిమా వార్తలని ప్రచురించే ప్రముఖ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'(The Hollywood reporter India)ఏర్పాటు చేసిన ఉమెన్ ఇన్ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమంలో పాల్గొంది. సదరు కార్యక్రమంలో సమంత చెప్పిన మాటలు ఇప్పుడు తెలుగుతో పాటు సౌత్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి తను ఏం మాట్లాడిందో చూద్దాం. సమంత మాట్లాడుతు మహిళా క్యారెక్టర్స్ కేవలం హీరోకు మద్దతుగానో, ప్రేరణ ఇచ్చే వాటిగానే  పరిమితం కాకుండా, నిజ జీవితంలోని క్లిష్టమైన మనస్తత్వాలను ప్రతిబింబించేలా ఉండాలి. షూటింగ్ లొకేషన్లలో మహిళా కళాకారుల భద్రత ఒక చర్చాంశం కాకూడదు. ఇండస్ట్రీలో అదొక అత్యంత ఖచ్చితత్వంగా ఉండాలి. మహిళా ప్రధాన చిత్రాలని ఫీమేల్ లీడ్ క్యారక్టర్ లో చూడకుండా వాటిని కూడా కథలాగే పరిగణించే రోజు రావాలి. మహిళలు ఎవరి ప్రశంస కోసమో వేచి చూడకుండా తమ ప్రతిభతో సంపాదించుకున్న గౌరవాన్ని గర్వంగా స్వీకరించాలి. తమ హక్కుల కోసం నిరంతరం పోరాడటం కంటే, ఆ హక్కులని  స్వేచ్ఛగా అనుభవించే స్థితికి రావాలి. మనం ఇతరుల కోసం మన షెడ్యూళ్లని, అభిప్రాయాలని మార్చుకోవడమే కాకుండా, మన లక్ష్యాలను కూడా త్యాగం చేస్తున్నాం. విచారకరమైన విషయం ఏమిటంటే, మనం చేసేది  త్యాగం అని కూడా గుర్తించలేనంతగా అలవాటు పడిపోయాం. పురుషుల కంటే మనమే  పదిరెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతున్నాం. భవిష్యత్తులో సినిమాలని చూసే ధోరణిలో మార్పు రావాలని సమంత చెప్పుకొచ్చింది. Also read: Happy raj Movie Review: హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ  ఇక సమంత సినీజర్నీని చూసుకుంటే సొంత సంస్థలోనే 'మా ఇంటి బంగారం' చేస్తుంది. కొత్త షెడ్యూల్ త్వరలోనే స్టార్ కానున్నట్టుగా తెలుస్తుండగా సమంత లీడ్ రోల్. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ కూడా సమంత చేస్తున్నట్టుగా టాక్. ఆ ఇద్దరి పరిచయం కూడా ఫామిలీ మెన్ వెబ్ సిరీస్ లోనే ఏర్పడిన విషయం తెలిసిందే.    
నార్త్ తో పాటు సౌత్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'దో దీవానే షహర్ మే'. విభిన్న ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం త్వరలో స్ట్రీమింగ్ కానుంది. (Do Deewane Seher Mein) ఈ చిత్ర కథాంశం ఒక మెట్రో సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. నేటి తరం యువతలో ఉండే ఇన్ సెక్యూరిటీస్, కెరీర్ ఒత్తిళ్లు, నిజమైన ప్రేమ కోసం వారు పడే తపనను దర్శకుడు రవి ఉద్యావర్ చాలా సహజంగా చూపించాడు. సిద్ధాంత్ చతుర్వేది ఇందులో ఒక అమాయకమైన, నత్తి సమస్యతో ఇబ్బంది పడే యువకుడి పాత్రలో అద్భుతంగా నటించాడు.  మృణాల్ ఠాకూర్ తనదైన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది తొలిసారి జంటగా నటించినప్పటికీ, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరాయి.  జీ స్టూడియోస్ తో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఈ మూవీ ఓటీటీ విడుదల ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి రానుంది. థియేటర్లలో కంటే ఓటీటీలో ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీలకు ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతారు. పైగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో రొమాంటిక్ డ్రామాలకు మంచి ఆదరణ ఉండటంతో, 'దో దీవానే షహర్ మే' కచ్చితంగా మంచి వ్యూయర్ షిప్‌ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.  కథేంటంటే.. శశాంక్ (సిద్ధాంత్ చతుర్వేది) ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. అతను తెలివైన వాడైనప్పటికీ, నత్తి సమస్యతో బాధపడుతుంటాడు. దాంతో పబ్లిక్ లో మాట్లాడటానికి  కూడా భయపడుతుంటాడు. మరోవైపు రోష్ని (మృణాల్ ఠాకూర్) ఒక కంటెంట్ క్రియేటర్. ఆమెలో కూడా తాను అందంగా లేనని ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది. అలాంటి వీరిద్దరూ కలుస్తారు. వీరి ప్రేమ కథ ఏంటి? ఆ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కిందా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
  ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు.. ఇలా సంతోషంగా ఉండటానికి చేయాల్సినవన్నీ చేస్తారు. కానీ ఇన్నిచేసినా సరే.. కొందరు సంతోషంగా ఉండరు.  ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మంది ఆలోచించరు.  కేవలం అసంతృప్తి దగ్గరే ఆగిపోతారు.  కానీ క్షుణ్ణంగా గమనిస్తే.. ఒక వ్యక్తి చుట్టూ ఎన్ని సౌకర్యాలు, ఎన్ని సంతోషపెట్టే విషయాలు ఉన్నా ఆ వ్యక్తి సంతోషంగా ఉండటం లేదంటే.. ఆ వ్యక్తి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులే కారణం అయ్యే అవకాశం ఉంటుంది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే ఓర్వలేని వ్యక్తులు కొందరు ఉంటారు.  ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సంతోషాన్ని చెదపురుగుల్లా తినేస్తుంటారు.  పైశాచిక ఆనందాన్ని లోలోపలే అనుభవిస్తారు.  పక్కవాళ్ల సంతోషాన్ని నాశనం చేసే ఆ వ్యక్తులు ఎవరు?  వారి లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. ఎప్పుడూ ఏడుస్తూ కంప్లైంట్లు చేసే వ్యక్తులు.. జీవితంలో ఏ మంచినీ చూడని వాళ్ళు వీళ్ళు. వాతావరణం బాగుంటే, ఎండ వేడిమి గురించి ఫిర్యాదు చేస్తారు. మంచి ఉద్యోగం వస్తే, తమ బాస్‌ను విమర్శిస్తారు. వారి దృక్పథం ఎంత ప్రతికూలంగా ఉంటుందంటే, వారి పక్కన కూర్చోవడం కూడా  మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సానుకూల శక్తిని హరించివేస్తారు. వీరికి దూరంగా ఉండటమే ఉత్తమం. స్వప్రయోజనాలు చూసుకునేవారు.. స్నేహితులలో, బంధువులలో చాలామంది స్వార్థంగా ఉంటారు.  మాట్లాడి చాలా  రోజులు అయింది అంటూ మాటలు కలిపి తమ స్వప్రయోజనాల కోసం సహాయం అడుగుతుంటారు.  ఇలాంటి వారు ప్రతి ఒక్కరి సర్కిల్లో ఉంటారు.వీళ్ళు కేవలం తమకు సహాయం కావాలన్నా లేదా ఏదైనా పని చేయించుకోవాలన్నా మాత్రమే ఎదుటి వ్యక్తిని గుర్తు చేసుకుంటారు. పని పూర్తయిన వెంటనే మాయమైపోతారు. ఇలాంటి స్వార్థపరులు  ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు. చాడీలు చెప్పేవారు.. ఒకరి గురించి ఇంకొకరు దగ్గర చాడీలు చెప్పేవారు.. ఏదో ఒకరోజు ఎదుటి వారికి మీ గురించి చాడీలు చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.  అలాంటి వారికి నిజాయితీ ఉండదు. వారు సంబంధాలను పాడుచేయడానికి కల్పిత కథలను మాత్రమే చెబుతారు.  జీవితంలో మనశ్శాంతి కావాలంటే అలాంటి వ్యక్తులకు  దూరంగా ఉండటం మంచిది. అసూయ పరులు.. మీరు సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేవాడే నిజమైన స్నేహితుడు. అయితే, కొంతమంది మీతో చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తారు, కానీ రహస్యంగా మీ పురోగతిని చూసి అసూయపడతారు. మీరు కొత్త కారు కొన్నా, పదోన్నతి పొందినా, వారు మిమ్మల్ని అభినందిస్తారు, కానీ వారి కళ్ళలో, మాటల్లో ఒక వింతైన అసూయ  స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి అసూయపడే వ్యక్తులు మీ మంచిని ఎప్పటికీ కోరుకోలేరు. నిరాశ పరిచేవారు.. నువ్వు చేయలేవు.. నీకు చేతకాద.. నీకు సాధ్యం కాదు.. నువ్వు ఫెయిల్ అవుతావు.. వంటి మాటలు చెప్పే వ్యక్తులే మీ కలలకు, ధైర్యానికి అతిపెద్ద శత్రువులు. మీరు ఏదైనా కొత్తగా, సానుకూలంగా చేయాలని అనుకున్నప్పుడల్లా, వాళ్ళు తమ మాటలతో మిమ్మల్ని భయపెట్టి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి, వాళ్ళ మాటలను ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయాలి. పైన చెప్పుకున్న లక్షణాలు గల వ్యక్తులు ప్రతి ఒక్కరి చుట్టూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఇలాంటి వ్యక్తుల మాటలను ఎంత తక్కువ పరిగణలోకి తీసుకుంటే అంత మంచిది. లేకపోతే సంతోషాన్ని చెదపురుగుల్లా తినేసి,  మనిషిని అశాంతికి గురిచేస్తారు.                                        *రూపశ్రీ.
  క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి  సెంటిమెంట్లు బాగా  ఎక్కువ‌. ఎందుకంటే  ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి  సెంటిమెంట్ల  ద్వారా. అలా త‌న తండ్రి  తెలంగాణ  రాష్ట్ర స‌మితి అనే పార్టీని ఏప్రిల్ 27, 2001లో స్థాపించ‌గా.. కూతురు క‌విత, పాతికేళ్ల త‌ర్వాత‌.. అంటే 2026, ఏప్రిల్ 25న పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సుముహుర్తం ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.ఇంత‌కీ ఈ పార్టీ పేరు ఏమై ఉంటుంది? అంటే, తెలంగాణ ప్రజా జాగృతి అని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమె తెలంగాణ  జాగృతి అనే సామాజిక సంస్థ‌ను న‌డుపుతున్నారు. దీనికే ప్ర‌జా అనే ప‌దం  చేర్చుతూ దాన్ని రాజ‌కీయ పార్టీగా మార్చుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.   ఇక పార్టీ గుర్తులు ఏవి ఉంటాయో ప‌రిశీలిస్తే.. ధ‌ర్మ గంటను ఖ‌రారు చేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. జెండా, అజెండా  ఎలాంటివో గ‌మ‌నిస్తే ఇప్ప‌టికే జాగ్ర‌త్తికంటూ తెలుపు, లేత ప‌చ్చతో కూడిన జెండా రంగులున్నాయి. వీటికి అజెండాను జోడిస్తే.. సామాజిక తెలంగాణ లేదా తెలంగాణ  ఫ‌స్ట్.. ఆమె తీసుకున్న రాజ‌కీయ విధానంగా స‌మాచారం.  ఇక యువ‌త‌, మ‌హిళ‌లు, అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కులు, మ‌రీ ముఖ్యంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు అండ‌గా నిల‌బ‌డ్డం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక బీసీ  సంగ‌తి స‌రే స‌రి. మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల‌పై పోరాటం కూడా ఆమె తీసుకుంటున్న పొలిటిక‌ల్ లైన్ల‌లో భాగ‌మే.  వ‌చ్చే ఎన్నిక‌ల  నాటికి డీలిమిటేష‌న్లో భాగంగా తెలంగాణ నియోజ‌క‌వ‌ర్గాలు సైతం పెర‌గ‌నుండ‌టంతో ఆమె పార్టీ నుంచి కూడా ఎంద‌రో కొత్త రాజ‌కీయ నాయ‌కులు పుట్టుకొచ్చేలా  తెలుస్తోంది.ఇక ఏప్రిల్ 25న ఎందుకు? ఈ ముహుర్తం  ఖ‌రారు చేయ‌డం వెనక ఉన్న ఉద్దేశ‌మేంటో ప‌రిశీలిస్తే.. కొన్ని జ్యోతిష శాస్త్ర ప‌ర‌మైన అంశాలు ఇందులో దాగి  ఉన్నట్టు స‌మాచారం. ఏప్రిల్ ఇర‌వై ఐదున రాజ‌యోగాన్నిచ్చే గ్ర‌హ‌గ‌తుల సంచారం  క‌నిపిస్తోందని అంటారు పండితులు. కొత్త  ప‌నులు ప్రారంభించ‌డానికి  ఇది సుదినంగా  చెబుతున్నారు.  దానికి తోడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వానికి కూడా ఈ తేదీతో కొంత సంబంధ‌ముంది. పాతికేళ్ల క్రితం కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్రారంభించారు క‌విత తండ్రి కేసీఆర్. అదే తేదీకి అటు ఇటుగా తెలంగాణ ప్ర‌జా జాగృతి ప్రారంభిస్తున్నారు కేసీఆర్ త‌న‌య‌ క‌విత‌. ఆ పార్టీ  ఆనాడు ఎంతగా ఎదిగిందో, త‌న పార్టీ  కూడా అంతేలా  ఎదుగుతుంద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు క‌విత‌. ఉగాది త‌ర్వాత వ‌చ్చే శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల అనంత‌రం త‌న పార్టీ  జెండా ఎగుర‌వేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌వ‌చ్చ‌న్న  న‌మ్మ‌కాలు కూడా క‌విత‌కు ఉన్న‌ట్టు స‌మాచారం.  బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు అన్యాయం జ‌రిగింది. అలాంటి వారికి త‌మ పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాన‌ని అంటున్నారు క‌విత‌. ఇక చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా సాధికార‌త‌ను తీసుకొచ్చేలా 33 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు కూడా ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ప్ర‌త్యేకించీ యువ‌త కోసం ఉద్యోగ నోటిఫికేష‌న్లు.. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం కూడా క‌విత త‌న విధానంగా  చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌విత  పార్టీ ఎఫెక్ట్ ఎంత‌?  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి దీటుగా ఆమె పార్టీ టీపీజే  ఎదిగే అవ‌కాశం ఎంత‌? ద‌క్షిణాది నుంచి జ‌య త‌ర్వాత ఆ స్థాయిలో ఒక మ‌హిళ‌గా ఆమె రాజ‌కీయంగా ఎదిగి సీఎం కాగ‌ల‌రా?  తేలాల్సి ఉంది.
  తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా పార్టీగా నామకరణం చేసిన నూతన పార్టీని ఏప్రిల్ 25 తేదీన ఉదయం 10గం.లకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్‌లోని మునిరాబాద్‌లో పార్టీ ప్రకటిస్తానని, అదే రోజు పార్టీ జెండా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తం ఉందన్నారు.  రాముని ఆశీర్వాదంతో పార్టీ ప్రకటన తేదీని నిర్ణయించామని ముహుర్తాలపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. వారణాసి వెళ్లి గంగా స్నానం చేసి పార్టీ నీ లంచ్ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు స్పష్టం చేశారు.  వాస్తవానికి ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందు పార్టీని, జెండాను ఆవిష్కరించనున్నట్లు కవిత ప్రకటించడం విశేషం. ఏఏ అంశాలపై కొత్త పార్టీ పోరాటం చేయాలో తమ దృష్టికి తీసుకురావాలని కవిత శ్రీరామ నవమి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందంటున్న కవిత, తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత  ఉద్యోగాల కోసం వేచి చూడాల్సి వస్తోందని పరోక్షంగా బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.  తమ కొత్తపార్టీ ద్వారా యువత కోసం ఏం చేయబోతున్నామో చెబుతామని. యువత, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కవిత వెల్లడించారు.  జాగృతి సంస్థ ద్వారా బీసీలు, దళితుల హక్కుల కోసం పోరాటం చేశామని,  పార్టీ ఆవిర్భావం నాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు,యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత కోరారు.  మొత్తానికి తెలంగాణ జాగృతి సంస్ధ...రాజకీయ పార్టీగా మారబోతుందిప్పుడు. తమ పార్టీ ఎవరికీ బీ పార్టీ కాదని ....తమది నెంబర్ వన్ పార్టీగా ఉండబోతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. కొత్త పార్గీ నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో సలహాలు ఇవ్వాలని ,   అందుకోసం ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేస్తామని, అలాగే మెయిల్‌కి మేసేజ్ చేయవచ్చన్నారు. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత,  అప్పటిలోగా.. అంటే రానున్న 28 రోజుల్లో ప్రతి ఒక్కరినీ కలుస్తానని ప్రకటించారు.. తెలంగాణ ఉద్యమకారులు, యువత, మహిళలు, మెథావులు, కవులు, పాత్రికేయులు అందరితో చర్చిస్తామన్నారు.
  ఇటీవ‌ల జ‌గ‌న్ ఒక  కీల‌క‌మైన కామెంట్ చేశారు. చంద్ర‌బాబు మొహం చూసి రాష్ట్రానికి  పెట్టుబ‌డులు ఎలా వ‌స్తాయంటూ.. బాడీ షేమింగ్ సైతం చేశారు. ఈ విష‌యంపై.. కేంద్ర‌మంత్రి పెమ్మ‌సాని తీవ్రంగా  రియాక్ట‌య్యారు. మీలా బాడీషేమింగ్ కామెంట్లు చేయ‌డం త‌మకూ తెలుస‌న్నారు పెమ్మ‌సాని. అయితే ఇందుకు త‌మ‌కు సంస్కారం అడ్డు వ‌స్తోంద‌ని చెప్పారు. ఒక్క మాట‌తో తాము కూడా చంపేయ‌గ‌ల‌మ‌ని పెమ్మ‌సాని అన‌డంతో.. ఆ మాట అడ్డు పెట్టుకున్న అంబ‌టి.. పెమ్మ‌సానిపై ఒక ట్వీట్ చేశారు. మాట‌తోనే చంపేంత రౌడీవా? పెమ్మ‌సానీ! అంటూ.. బేసిగ్గా రాంబాబుకు పెమ్మ‌సాని సాటి ప్ర‌త్య‌ర్ధి ఏమీ  కాదు. పెమ్మ‌సాని  ఎంపీ, అంబ‌టి ఎమ్మెల్యే కంటెస్టెంట్. అంబ‌టి హిస్ట‌రీ ఒక  సారి తిర‌గేస్తే.. 1989లో కాంగ్రెస్ నుంచి  రేప‌ల్లె నుంచి పోటీ చేసిన అంబ‌టి తొలిసారి ఎమ్మెల్యేగా  గెలిచారు. ఆ త‌ర్వాత అంటే 2019లో వైసీపీ హ‌వాలో మ‌రోమారు స‌త్తెన‌ప‌ల్లి  నుంచి గెలిచారు. అంటే ముప్పై ఏళ్ల త‌ర్వాత తిరిగి ఎమ్మెల్యే అయ్యారు అంబ‌టి. వ‌రుస‌గా  రేప‌ల్లె నుంచి ఓడి.. ఆ త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేయ‌ని అంబ‌టి కాంగ్రెస్‌లో  ఉండ‌గా ద‌క్కిన ప‌ద‌వి ఒకే ఒక్క‌ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పోస్టు. ఆ త‌ర్వాత వైసీపీ గెలిచిన‌పుడు గెల‌వ‌డంతో ఆయ‌న‌పై ఎన్ని లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చినా కూడా జ‌గ‌న్ మంత్రిప‌ద‌వి ఇచ్చి గౌర‌వించారు. ఇదిలా ఉంటే పెమ్మ‌సాని ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప‌రిశీలిస్తే.. ఉస్మానియాలో వైద్య విద్య అభ్య‌సించి.. యూఎస్ వెళ్లారు. అక్క‌డ ఎంతో క్లీన్ గా ఒక కంపెనీ పెట్టి.. కోట్లాది రూపాయ‌ల డ‌బ్బు సంపాదించారు.. తాను పుట్టిన ఆంధ్ర‌గ‌డ్డ‌పై మ‌మ‌కారం చావ‌క‌.. తిరిగి ఏపీ వ‌చ్చారు. 2019లోనే  న‌ర‌స‌రావుపేట ఎంపీగా  పోటీ చేడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఈలోగా ఇక్క‌డి నుంచి  రాయ‌పాటిని రంగంలోకి దించింది టీడీపీ అధిష్టానం. దీంతో సైలంట్ గా ఉన్న పెమ్మ‌సాని, 2024లో గుంటూరు ఎంపీగా టీడీపీ టికెట్ సాధించి.. ఎట్ట‌కేల‌కు ఎంపీగా గెల‌వ‌డం మాత్ర‌మే  కాక‌.. కేంద్ర మంత్రిగానూ ప్ర‌మోట్ అయ్యారు. అయితే అంబ‌టి పెమ్మ‌సానిని ఇంత‌గా టార్గెట్ చేయ‌డం వెన‌క గ‌ల జ‌గ‌న్ ఎత్తుగ‌డ ఏంటంటే.. పెమ్మ‌సాని త‌మ‌లా కాకుండా ఎంతో క్లీన్ గా ఎదిగిన  ఒకానొక కోటీశ్వ‌రుడు. దేశంలోని  ఎంపీల్లోనే రిచెస్ట్. అదే జ‌గ‌న్ ఎన్నో సూట్ కేసు కంపెనీలు పెట్టి, ఆపై క్విడ్ ప్రోకో వంటి వాటికి పాల్ప‌డి.. దేశంలోనే అత్యంత సంప‌న్న ఎమ్మెల్యేగా ఎదిగారు.  ఈ రెండు ఎదుగుద‌ల క్ర‌మాల‌ మ‌ధ్య పోలీక చూస్తే న‌క్క‌కీ- నాగ‌లోకానికీ ఉన్నంత తేడా  ఉంటుంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అంబ‌టిని కావాల‌ని గుంటూరు ప‌శ్చిమ ఇంచార్జ్ గా నియ‌మించారు. ఆపై శంక‌ర్ విలాస్ బ్రిడ్జ్ ద‌గ్గ‌ర  నుంచి ప్ర‌తిదానికీ పెమ్మ‌సానిపై ఫోక‌స్ పెట్టి వ‌రుస వివాదాల్లోకి లాగే య‌త్నం చేస్తున్నారు.  దీనర్ధం ఏంటంటే.. ఇటు జ‌గ‌న్ ఆయ‌న మెచ్చిన  కాపు టైగ‌ర్ అంబ‌టి మాత్ర‌మే కాదు.. పెమ్మ‌సాని కూడా సేమ్ టు సేమ్ ఒకే ర‌క‌మైన వాళ్ల‌నే ముద్ర వేయించ‌డంలో భాగంగానే ఇదంతా జ‌రుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే తాను ఎంపీ  కేండేట్ కాక పోయినా స‌రే, అంబ‌టికి ఎలాంటి తాహ‌తు లేకున్నా  స‌రే పెమ్మెసానిపై టార్గెట్ చేయిస్తున్నారు జ‌గ‌న్. ఇందులో ఇంత స్ట్రాట‌జీ ఉంది  కాబ‌ట్టి... పెమ్మ‌సాని సైతం కాస్త కంట్రోల్లో ఉండాల‌ని సూచిస్తున్నారు గుంటూరు వాసులు, ఇత‌ర‌ కూట‌మి కార్య‌క‌ర్త‌లు.  
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేటికాలంలో చర్మ సంరక్షణలో భాగంగా చాలా రకాల క్రీములు వాడుతూ ఉంటారు.  ఇవి కూడా మూత్రపిండాల సమస్యకు కారణం అవుతాయి అనే మాట చాలా చర్చలకు దారి తీస్తోంది.   మూత్రపిండాల సమస్యకు అసలు కారణాలు ఏంటి? మూత్రపిండాల సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. రెండు రూపాలు.. మూత్రపిండాల వ్యాధులు రెండు రూపాలలో వస్తాయి.  మధుమేహం వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి మొదటిది. 50 శాతం మందికి మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు మరొక కారణం. మూత్రపిండాల్లో రాళ్లు,  ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి ఇతర కారణాలు. జన్యుపరంగా,  ఇతర మందులు తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల వ్యాధి రావచ్చు. తాత్కాలిక,  శాశ్వత మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయి. తాత్కాలిక మూత్రపిండాల వ్యాధి.. మలేరియా, డెంగ్యూ జ్వరం లేదా లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధి వచ్చినప్పుడు,  మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ అవసరం కావచ్చు. లేదా మందులతో దీనిని నయం చేయవచ్చు. ధీర్షకాల మూత్రపిండాల వ్యాధి.. కొంతమందికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉండవచ్చు. ఇది మధుమేహం,  అధిక రక్తపోటు కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, చివరికి  డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం  ఏర్పడుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల వ్యాధికి తరచుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే చాలామంది  దానిని పట్టించుకోరు. ఏదైనా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ లక్షణం కాళ్ళలో నీరు చేరడం. ఇతర లక్షణాలలో లైట్ గా చలి, నొప్పి, జ్వరం, లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చలి,  వెన్నెముకకు ఇరువైపులా నొప్పి వంటివి  ఉంటాయి. పాదాల వాపు మూత్రపిండాల వ్యాధి లక్షణం అని ఖచ్చితంగా చెప్పలేము. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా పాదాల వాపు రావచ్చు. జీవనశైలిలో మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తినడం,  ఊబకాయం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీసే పరిస్థితులు. మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం కనిపించడం,  మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణాలే. చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో మూత్రపిండ వ్యాధులు.. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగించే క్రీములు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. వైద్యపరంగా ఉపయోగించే క్రీములు సాధారణంగా పెద్ద సమస్యలను కలిగించవు.  కానీ చాలామంది అందం మీద పిచ్చితో సోషల్ మీడియాలో కనిపించే ప్రమోషన్ యాడ్స్,  ఇంటర్నెట్ లో కనిపించే పేక్ రివ్యూస్ చూసి సొంతంగా క్రీములు ఎంచుకుని వాడుతుంటారు. అలాంటి క్రీములలో అధిక పరిమాణంలో పాదరసం ఉండవచ్చని అంటున్నారు. పాదరసానికి చర్మాన్ని తెల్లగా చేసే గుణం ఉంది. పాదరసం మూత్రపిండాలకు ప్రమాదకరమైన పదార్థం. మూత్రపిండాలకు హాని కలిగించే మరొక పదార్థం ఆర్సెనిక్. చాలా క్రీములలో వీటన్నింటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు  వాడటం వల్ల, ఇది చర్మం ద్వారా రక్తంలో కలిసి మూత్రపిండాలకు చేరి ప్రమాదం కలిగిస్తుందని పరిశీలనలలో తేలింది. వైద్య సలహా లేకుండా ఎలాంటి క్రీములు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.  చాలామంది రోడ్ సైడ్ లేదా మాల్స్,  ఆఫీసుల దగ్గర దుకాణాలలో పిచ్చి  ఆహారాలకు బదులు ఫ్రూట్ చాట్ తినడం మంచిదని అనుకుంటారు. దుకాణాలలో కూడా వివిధ రకాల పండ్లను కలిపి ప్రూట్ చాట్ గా తయారు చేసి అమ్ముతుంటారు.  ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫ్రూట్ చాట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివని అనుకుంటారు.  కానీ ఫ్రూట్ చాచ్ గురించి వైద్యులు,  ఆహార నిపుణులు దిమ్మతిరిగే నిజాలు చెబుతున్నారు.  ముఖ్యంగా వేసవిలో అందరూ ఫ్రూట్ చాట్ ఎక్కువగా తినాలని అనుకుంటారు కాబట్టి ఫ్రూట్ చాట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోవాలి.. తొక్క వల్ల కలిగే నష్టం.. చాలా వరకు ఫ్రూట్ చాట్ లో పండ్ల మీద తొక్కను తొలగించి పండ్లను ముందుగానే ముక్కలు చేసి సిద్దంగా పెట్టి ఉంటారు. కస్టమర్లు రాగానే వాటిని అందిస్తుంటారు.  పండ్ల పై తొక్క పండ్లను చెక్కు చెదరకుండా రక్షిస్తాయి.  కానీ పండ్లను తొక్క తొలగించి  కోసిన తర్వాత ఈ రక్షణ పొర తొలగిపోతుంది. పండు లోపలి భాగం నేరుగా గాలి, దుమ్ము, కాలుష్యం,  మురికి మొదలైనవాటికి గురవుతుంది. ఈ పండ్లను ఎక్కువ కాలం పాటు, ముఖ్యంగా వేడి వాతావరణంలో  వదిలేస్తే, బ్యాక్టీరియా,  ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. పరిశుభ్రత లోపించడం వల్ల రోడ్డు పక్కన పండ్లు అమ్మే చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. నిల్వ.. కోసిన పండ్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే, అవి  తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ కలుషితమైన పండ్లను తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్,  కడుపునొప్పి,  వాంతులు విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఇంట్లో  చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వంటి  బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఇలాంటి ఫ్రూట్ చాట్ లేదా ముందే ముక్కలుగా కోసిన పండ్లు ఆరోగ్యానికి మరింత హాని చేసే అవకాశం ఎక్కువ. పోషణ ఉండవు..  శరీరానికి తగినంత పోషణ అందించడానికి  పండ్లు తింటాము, కానీ పండ్లను కోసి ఎక్కువ సేపు నిల్వ ఉంచడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. గాలికి నేరుగా గురికావడం వల్ల విటమిన్ సి వంటి సున్నితమైన, ప్రయోజనకరమైన పోషకాలు క్రమంగా నశించిపోతాయి. ముందుగా కోసిన పండ్లను తినడం వల్ల  అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉండటమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందవు. ప్యాక్ చేసిన కటింగ్ ఫ్రూట్స్.. సూపర్‌మార్కెట్లలో లభించే డబ్బాలలో ప్యాక్ చేసిన కోసిన పండ్లు, విడిగా అమ్మే పండ్ల కంటే కొంచెం సురక్షితమైనవిగా పరిగణించబడవచ్చు. అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేసేటప్పుడు  జాగ్రత్తగా ఉండాలి. వాటి గడువు తేదీని,  వాటిని నిల్వ ఉంచిన ఉష్ణోగ్రతను  తనిఖీ చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే.. మార్కెట్ నుండి  తాజాగా, కోయని పండ్లనే ఇంటికి తెచ్చుకోవాలి. పండ్లను శుభ్రమైన నీటితో బాగా కడిగి, ఆ తరువాతే కోయాలి. పండ్లను కోసిన తర్వాత వాటిని ఎక్కువ సేపు ఆరుబయట ఉంచకూడదు. కోసిన పండ్లు ఏవైనా మిగిలి ఉంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. రోడ్డు పక్కన ఎలాంటి శుభ్రత లేని చోట,  ముందుగానే పండ్లను కోసి నిల్వ చేసి అమ్మే చోట పండ్ల ముక్కలు కొనుగోలు చేసి తినడం మంచిది కాదు.                                    *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.