ముఖం మీద మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ కు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..!

 

ముఖం అందంగా కనిపించాలంటే ముందు చర్మం క్లియర్ గా ఉండాలి. కానీ చాలావరకు మహిళల ముఖం మీద మొటిమలు, మచ్చలు,  పిగ్మెంటేషన్ మొదలైనవి ఉంటాయి. వీటిని తగ్గించుకోవడం కోసం చాలా రకాల వాణిజ్య ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ వీటి వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. వీటి బదులు ఆయుర్వేదంలో అద్బుతమైన చిట్కాలు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.  ఇంకొక విషయం ఏమిటంటే.. ఇవి ఇంటిపట్టునే చక్కగా సులువుగా తయారుచేసుకుని వాడవచ్చు.  అవేంటో తెలుసుకుంటే..

మొటిమలుకు చిట్కాలు..

 తులసి రసం..

తులసి ఆకుల రసం తీసుకుని ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత కడగాలి. ఇది యాంటీబాక్టీరియల్ గుణాలతో మొటిమలపై అద్భుతంగా పని చేస్తుంది. దీన్ని వారంలో ఒక సారి వాడవచ్చు.

చందనం + పసుపు పేస్ట్..

చందనం పొడి + చిటికెడు పసుపు + తేనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి.  ఇది చర్మాన్ని చల్లగా ఉంచుతుంది.   చర్మ రంధ్రాలు క్లీన్ అవుతాయి.

 ముడతలుకి ఆయుర్వేద చిట్కాలు..

 బాదం నూనె మర్దన

ప్రతి రాత్రి నిద్రకు ముందు ముఖానికి 2–3 నిమిషాలు బాదం నూనెతో మర్దన చేయాలి.  ఇది చర్మాన్ని పోషిస్తుంది, ముడతలు తగ్గుతాయి.

ఉసిరికాయ రసం..

రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగడం ద్వారా చర్మం బిగుతుగా ఉంటుంది. మొటిమల మచ్చలు, ముడతలు తగ్గుతాయి.

 పిగ్మెంటేషన్ కి చిట్కాలు..

శెనగపిండి మాస్క్..

స్పూన్ శెనగపిండి + చిటికెడు పసుపు + 1 స్పూన్ పెరుగు + కొద్దిగా నిమ్మరసం. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.  ఇది స్కిన్ టోన్‌ను సమతుల్యం చేస్తుంది, మచ్చలు తగ్గుతాయి.

పొటాటో ప్యాక్ ..

బాగా తురిమిన ఆలుగడ్డ  + కొద్దిగా నిమ్మరసం కలిపి నల్లదనం ఉన్న చోట రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి.  వారం 3 సార్లు చేస్తే మంచి ఫలితం.

                                *రూపశ్రీ.