Read more!

పండంటి బిడ్డ పుట్టాలంటే గర్భిణీ స్త్రీలు వీటిని తప్పక తీసుకోవాలి!

పండంటి బిడ్డ పుట్టాలంటే గర్భిణీ స్త్రీలు వీటిని తప్పక తీసుకోవాలి!

స్త్రీలు సాధారణ సమయాల్లో తీసుకునే జాగ్రత్తల కంటే.. వారు గర్భవతులుగా ఉన్న సమయంలో తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడం కోసం, గర్భిణీ స్త్రీ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం, గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మంచి ఆహారం గర్భిణీ స్త్రీని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఆ ఆహారం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో, గర్భిణీ స్త్రీ ఆహారం ద్వారా డెలివరీ సమయంలో సంభవించే సమస్యలను కూడా నివారించవచ్చు. గర్భధారణ సమయంలో స్త్రీ ఏది తింటే అది పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలకు పూర్తి పోషకాహారం లభిస్తే, ప్రసవం తర్వాత ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో స్త్రీ తప్పనిసరిగా కొన్ని పదార్థాలు తినాలి. గర్భిణీ స్త్రీకి, పుట్టబోయే బిడ్డకు మేలు చేసే ప్రెగ్నెన్సీ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

గర్భిణీ స్త్రీలు ఏమి తినాలంటే… 

పాలకూర

పచ్చి కూరగాయలలో అన్ని పోషకాలు ఉంటాయి. ఇందులో పాలకూర తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పాలకూరలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు అనేక ఖనిజాలు ఉంటాయి. పిల్లల అభివృద్ధికి, మెరుగైన ఆరోగ్యానికి బచ్చలికూర తీసుకోవడం అవసరం. గర్భిణీ స్త్రీలు పాలకూర తీసుకోవడం వల్ల  పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యం, తీక్షణమైన బుద్ధి లభిస్తాయి.

గుడ్డు

గుడ్డు కూడా పోషకాలతో నిండి ఉంది. గుడ్డులో ప్రొటీన్లతో పాటు విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. శిశువు మెదడు అభివృద్ధికి విటమిన్ డి ముఖ్యమైనది. అందుకే గర్భిణీ స్త్రీలు గుడ్లు తినాలి.

బాదం

బాదంలో చాలా పోషకాలు ఉన్నాయి. బాదంపప్పు తింటే గుండె ఆరోగ్యం  పదునవుతుంది.  ఇది గర్భిణీ స్త్రీలకు వారి పిల్లలకు కూడా మంచిది. బాదంపప్పులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. గర్భధారణ సమయంలో స్త్రీలు బాదంపప్పును తీసుకోవాలి. ఇది పిల్లల మెదడు అభివృద్ధిని మెరుగుపరుస్తుంది.

తాజా పండ్లు

తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తాజా పండ్ల నుండి విటమిన్లు లభిస్తాయి. స్త్రీ గర్భధారణ సమయంలో నారింజ, అరటి, మామిడి, ద్రాక్ష, యాపిల్ మొదలైన పండ్లను తీసుకోవాలి. కావాలంటే ఫ్రూట్ జ్యూస్ చేసి తాగొచ్చు.

పెరుగు

గర్భిణీ స్త్రీలు పెరుగు తీసుకోవడం వల్ల బిడ్డకు ఆరోగ్యకరం. ఇది చాలా మేలు చేస్తుంది. పెరుగులో విటమిన్ సి సహా చాలా ప్రోటీన్లు ఉంటాయి. రోజూ పెరుగు తీసుకోవడం వల్ల డెలివరీ తర్వాత ఆరోగ్యవంతమైన మరియు అభివృద్ధి చెందిన బిడ్డ పుడుతుంది.

పాలు

పిల్లలైనా, పెద్దలైనా, ప్రతి ఒక్కరూ పాలు తీసుకోవాలని సూచిస్తారు. ఒక గ్లాసు పాలలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీకి కఫుపులో బిడ్డకు పాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీంతో శరీరానికి బలం చేకూరుతుంది. ఆరోగ్యం ఏర్పడుతుంది. 

అందరికీ అందుబాటులో ఉండే ఈ పదార్థాలు తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యం.

                                 ◆నిశ్శబ్ద.