కూరగాయల మార్కెట్, కూకట్పల్లి ఫ్లైఓవర్ అదే తెలుసు నాకు అప్పటికి
on Jul 31, 2025

ప్రశాంత్ బిగ్ బాస్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నావంటే ఏదో జరుగుతోంది ? అని అంది వర్ష. "అంతకు మించి" అని సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. "మనతో పాటు పొలంలో పని చేసిన అంకుల్స్, ఆంటీలు కానీ ఒరేయ్ కోతి నా కొడకా ఇది ఇంకా ఆపవా" అని అడిగితే "ఆపము అది. అది అట్లే నడుస్తూ ఉంటుంది. "ఉన్నది చిన్న ఫోన్..అందులో వీడియోస్ చేస్తే బిగ్ బాస్ వరకు వెళ్తాను అని ఎలా అనిపించింది" అని అడిగింది వర్ష ." ఒక సారి బాపు దగ్గర ఒక పెద్దాయన వచ్చారు. నీ కొడుకు ఎం చేస్తున్నాడు అంటే పొలం కాడ పని చేస్తున్నాడు అని చెప్పాడు. ఆయన కొంచెం తీసిపారేసినట్టు మాట్లాడాడు..దాంతో నాకు బాధ అనిపించింది.
బాపు దగ్గర 500 లు తీసుకున్న.. హైదరాబాద్ కొత్త. ఎక్కడుండాలో తెలీదు. ఒక్కటే తెలుసు. కూరగాయల మార్కెట్,కూకట్పల్లి ఫ్లైఓవర్ కింద కూరగాయలు అమ్ముకోవాలి పోవాలే" అన్నాడు. "ఎవరినో అడగలనిపిస్తుంది నాకు "నీ హార్ట్ టప్ టప్ మని కొట్టుకుంటోంది. ఒక పోరి ఎలా ఉంది ? " అనేసరికి "తెల్లగా ఉంటది" అంటూ ప్రశాంత్ సిగ్గుతో కామెడీ చేసాడు. "బిగ్ బాస్ తర్వాత మీరు ఇద్దరూ టచ్ లో లేరా" అని అడిగింది. "షో ఐపోయాక మాట్లాడాను కానీ..ఆ తర్వాత ఇంకా మాట్లాడలేదు . మంచిగా ఉండాలని కోరుకుంటా అక్క" అంటూ ఆన్సర్ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 7 టైములో హౌస్ లో పల్లవి ప్రశాంత్ , రతికా మధ్య ఒక లవ్ స్టోరీ నడిచిన విషయం తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కూడా రాతికతో బాగా క్లోజ్ అయ్యాడు. ఆమె ప్రపంచం అన్నట్టు ప్రవర్తించేవాడు. దాంతో నెటిజన్స్ కూడా పల్లవి ప్రశాంత్ ని ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



