Jayam serial : పొంగలి రుచిచూపించిన కొత్తపనిమనిషి.. శంకుతలని గంగ మార్చేస్తోందా!
on Jul 31, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -15 లో.....పెద్దసారు, గంగ మాట్లాడుకుంటారు. కొడుకు చనిపోయాడు అందుకే నా భార్య బాధతో గదిలో నుండి బయటకు రావడం లేదు.. అసలు ఏం తింటుందో.. ఏ టైమ్ కి పడుకుంటుందో తెలియదు.. నువ్వు తనలో మార్పు తీసుకొని వస్తావని నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చానని గంగతో పెద్దసారు అంటాడు.
కిచెన్ లోకి గంగ వెళ్లి నేను వంట చేస్తాను.. మీరు పక్కకి తప్పుకోండి అని గంగ అంటుంది. ఇంతకీ ఏం వంట చెస్తున్నావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. పొంగలి చేస్తున్నా అని గంగ అనగానే అది శకుంతలకి బాగా ఇష్టమని పెద్దసారు అంటాడు. గంగ పొంగలి చేసి శకుంతల దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది. ఎవరు అని కోపంగా శకుంతల ఆడుగగా నేను భానుని అని అనగానే శకుంతల డోర్ తీస్తుంది. మీకు ఇష్టమైన వంట చేసుకొని వచ్చానని గలగల మాట్లాడుతుంటే శకుంతల కొడుకు భాను మాట్లాడినట్లుగా శకుంతల ఉహించుకుంటుంది. తనకి ఇష్టమైన పొంగలి చేసానని తినిపిస్తుంది. అందరు గంగని తిడుతుందనుకుంటారు కానీ శకుంతల పొంగలి తింటు మాట్లాడుతుంటే గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు శకుంతల గది దగ్గర ఉండడంతో ఏమైంది పెద్దమ్మకి అని రుద్ర కంగారుపడతాడు. ఏం లేదు కొత్తగా పనిమనిషి జాయిన్ అయింది. తనతో శకుంతల బాగుంటుందని అనగానే నేను ఒకసారి చూస్తానని రుద్ర అంటాడు. వద్దు మళ్ళీ నిన్ను చూస్తే ఏమన్నా అంటుందని పెద్దసారు అనగానే సరే నేను వెళ్తున్నానని రుద్ర వెళ్తాడు.
ఆ తర్వాత రుద్ర వెళ్తుంటే కార్ వెనకాల గంగ కూర్చొని ఉంటుంది. ఆ విషయం రుద్రకి తెలియదు. రుద్ర సూపర్ మార్కెట్ దగ్గర కార్ ఆగగానే తన కంటే ముందు వెళ్లి పూజ చేస్తుంది గంగ. అప్పుడే గంగని చూస్తుంటాడు రుద్ర. తరువాయి భాగంలో శకుంతల వచ్చి వంట చేస్తుంది. అందరు తినేసి కాసేపటికి పడుకుంటారు. రుద్ర ఒక్కసారిగా లేచి పెద్దమ్మ చేతిగోరు ముద్దలు తినలేను.. తను వండింది అయిన తింటానని రుద్ర భోజనం చేస్తుంటే గంగ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



