Eto Vellipoyindhi Manasu : కొత్తకోడలికి అత్త చెక్.. ప్రెస్ మీట్ లో తను దొరికిపోనుందా?
on May 10, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -92 లో.. అభి చేసిన కుట్రలో భాగంగా.. న్యూస్ లో రామలక్ష్మి, సీతాకాంత్ లకు సంబంధించిన న్యూస్ ని అప్లోడ్ చేయిస్తాడు.. అది న్యూస్ లో రావడం చూసి.. ఇంట్లో అందరు షాక్ అవుతారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సీతాకాంత్.. రామలక్ష్మి అనే అమ్మాయిని అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుని సహాజీవనం చేస్తున్నాడని న్యూస్ లో వస్తుంది.
అది చుసిన ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ న్యూస్ ఏంటి రామలక్ష్మి అని శ్రీలత నీలదీస్తుంటే.. అప్పుడే సీతాకాంత్ వచ్చి ఏమైందని అడుగుతాడు. శ్రీవల్లి న్యూస్ చూపిస్తుంది.. అదంతా ఎవరో గిట్టని వాళ్ళు చేస్తున్నారు.. బిజినెస్ లో నన్ను ఎదురుకోవడానికి ఇలా చేస్తుంటారని సీతాకాంత్ అంటాడు. ఆ న్యూస్ కి క్లారిటీ ఇవ్వాలి అంటే రేపు ప్రెస్ మీట్ పెట్టాలని శ్రీలత అంటుంది. సీతాకాంత్ వద్దని చెప్పిన కూడా శ్రీలత వినకుండా.. రేపు ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడాల్సిందే అని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత అవకాశాన్ని బాగా యూజ్ చేసుకోవడంలో నీకు సాటి ఎవరు లేరమ్మా.. కొంతమందికే తెలిసిన వీళ్ళు ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తారని శ్రీలతతో సందీప్ అంటాడు. మరొకసారి అందరి ముందు రామలక్ష్మి నా భార్య అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడని శ్రీలత అంటుంది.
మరొకవైపు శ్రీలత అన్న మాటలు గుర్తుకుచేసుకుంటూ.. రేపు ప్రెస్ మీట్ కి రామలక్ష్మిని ఒప్పించాలని గదిలోకి వెళ్లేసరికి రామలక్ష్మి లెటర్ రాసి వెళ్ళిపోతుంది. ఇక ఆడిన నాటకం చాలు.. రేపు ప్రెస్ మీట్ కి అటెండ్ అయి ఇంకా చిక్కులో పడలేనని అందులో రాసి ఉంటుంది. మరొకవైపు అభి రామలక్ష్మి ఇద్దరు ఒక దగ్గర కలుసుకుంటారు. ఇదంతా కావాలనే ఒకరు చేస్తున్నారు.. దీనికి సంబంధించిన సాక్ష్యం తీసుకొని వచ్చి చూపిస్తానని అభి అంటాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. సీతాకాంత్ సర్ సెలబ్రిటీ కాబట్టి ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారు.. నువ్వు రేపు ప్రెస్ మీట్ లో మాట్లాడు అని రామలక్ష్మితో అభి చెప్తాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read