జీవితంలోని ప్రతి సెకను నన్ను కృతజ్ఞతతో ఉండేలా చేశావ్!
on Nov 30, 2021
దిల్ రాజు కుమార్తె హన్షితారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తనకు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను తరచూ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ, ఫాలోవర్స్ను ఉత్సాహపరుస్తూ ఉంటుంది. 2014లో అర్చిత్రెడ్డితో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ జంటకు ఇద్దరు పిల్లలు. భర్తపై తన ప్రేమను ఎప్పటికప్పుడు పోస్టుల ద్వారా ఆమె వెల్లడిస్తూ ఉంటుంది. అర్చిత్రెడ్డి 35వ బర్త్డే వేడుకను రాత్రి ఆహ్లాదకరంగా నిర్వహించారు.
దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను ఈరోజు హన్షిత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఒక ఫొటోలో భర్త బుగ్గను హన్షిత ముద్దు పెట్టుకుంటూ ఉంది. మరో రెండు ఫొటోల్లో పిల్లలతో కలిసి దంపతులు పోజు ఇచ్చారు. ఇక హన్షిత షేర్ చేసిన వీడియోల్లో అర్చిత్ షాంపేన్ ఓపెన్ చేసి, బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటుంటే హన్షిత ఆనందంగా ఆ మూమెంట్ను ఎంజాయ్ చేయడం కనిపిస్తోంది.
వీటిని షేర్ చేసిన హన్షిత, "నాకు నువ్వేమిటనేది వివరించడానికి అందమైన పదాల్ని నేనెప్పటికీ కనుక్కోలేకపోవచ్చు. నా జీవితంలోని ప్రతి సెకను నన్ను కృతజ్ఞతతో ఉండేలా చేశావ్. అంతకంటే ఎక్కువ నేనేమీ అడగలేను. 'నిజానికి ప్రేమ మాత్రమే ఉంది.' ప్రతిరోజూ, ప్రతిసారీ నువ్వు నాకిచ్చేది అదే. హ్యాపీ బర్త్డే హజ్బెండ్." అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చింది. దానికి మై బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ కంపానియన్, సోల్మేట్ అనే హ్యాష్ట్యాగ్స్ను జోడించింది.