ఎవడు అప్లికేషన్ విడుదల
on Jan 5, 2014
సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో "ఎవడు" చిత్ర నిర్మాత దిల్ రాజు.. చిత్ర ప్రమోషన్స్ ను వినూత్నంగా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా మొబైల్ అప్లికేషన్ ను ఇటీవలే విడుదల చేసారు. ఈ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని "ఎవడు" చిత్రం గురించి అన్ని విషయాలు, పాటలు, పోస్టర్స్ లాంటివి పొందే సదుపాయం ఉంది. ఈ సినిమా కోసం తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని శృతిహాసన్ తెలిపింది. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి పాల్గొన్నారు.