ముంబైలో రష్మిక-చార్మి ఇలా కలుసుకున్నారు!
on Jun 14, 2021
నేషనల్ క్రష్ రష్మికా మందన్న అతి స్వల్ప కాలంలోనే టాలీవుడ్లోని అగ్రశ్రేణి తారల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలు ఆమెను యూత్ డ్రీమ్ గాళ్గా మార్చేశాయి. సౌత్లో ఆమెకున్న క్రేజ్ తెలిసిన బాలీవుడ్ డైరెక్టర్స్ ఆమెను తమ సినిమాల్లో తీసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అట్లా సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా 'మిషన్ మజ్ను' మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెడుతోంది రష్మిక. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ చాలాభాగం పూర్తయింది. దాని తర్వాత ఏకంగా అమితాబ్ బచ్చన్తో 'గుడ్బై' సినిమాలో నటించే చాన్స్ దక్కించుకుంది. ఆ సినిమాల కారణంగా ముంబైలో ఎక్కువగా గడపాల్సి రావడంతో తన పెట్ డాగ్ ఆరాను కూడా అక్కడకు తీసుకువెళ్లి దాంతో కాలక్షేపం చేస్తోంది.
మరోవైపు విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ 'లైగర్' షూటింగ్ సైతం ముంబైలో జరుగుతోంది. దాంతో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన విజయ్, రష్మిక ముంబైలో కలిసి డిన్నర్ చేస్తూ, కలిసి జిమ్కు వెళ్తూ కెమెరా కళ్లకు చిక్కుతున్నారు.
లేటెస్ట్గా రష్మిక, 'లైగర్' ప్రొడ్యూసర్స్లో ఒకరైన చార్మి ముంబైలో కలుసుకున్నారు. ఇద్దరూ తమ పెట్ డాగ్స్ను ఎత్తుకొని కెమెరాలకు పోజిచ్చారు. ఈ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు చార్మి. చూడగానే ఆ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. "When AURA meets ITEM Congratulations to new mom @rashmika_mandanna , your baby is the most adorable angel N yes , welcome to aamchi mumbai #pets #petmom " అంటూ ఆ ఫొటోలకు కాప్షన్ పెట్టారు చార్మి.
ఆ పోస్ట్కు రష్మిక స్పందించింది. "Thaaaaaaankyou @charmmekaur you’ll be seeing us a lot more now." అని కామెంట్ పెట్టింది. అంటే ముంబైలో ఇకనుంచీ తననూ, తన పెట్నూ చార్మి ఎక్కువగా చూస్తుంటావని చెప్పిందన్న మాట.
Also Read