త్వరలో కేజీయఫ్కి విక్రమ్!
on Jan 26, 2023
చియాన్ విక్రమ్ త్వరలో కేజీయఫ్కి వెళ్లబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తంగలాన్ సినిమా షూటింగ్ని అక్కడ ప్లాన్ చేశారు డైరక్టర్ పా. రంజిత్. కేజీయఫ్ ప్రజల జీవితం ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని వెరైటీ గెటప్లో కనిపిస్తున్నారు చియాన్ విక్రమ్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్. ప్రస్తుతం చెన్నైలో మాళవిక మోహనన్ మీద కీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు డైరక్టర్. త్వరలోనే కేజీయఫ్ లొకేషన్కి షిఫ్ట్ అవుతుంది చిత్ర బృందం. విక్రమ్తో పాటు, కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటారు.
ప్రధానంగా విక్రమ్, పశుపతి మధ్య జరిగే సన్నివేశాలను తెరకెక్కిస్తారు. మార్చిలోపు షూటింగ్ పూర్తి చేయాలన్నది మేకర్స్ ప్లాన్. పా. రంజిత్ కేజీయఫ్ ప్రజల జీవితాల మీద స్పెషల్గా స్టడీ చేశారట. ఇప్పటిదాకా ఎవరూ చెప్పని కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇన్సైడ్ సోర్స్. డైరక్టర్ రాసుకున్న కేరక్టర్ ఎలాంటిదైనా, దానికి తగ్గ న్యాయం చేసే నటుల్లో ఫస్ట్ బెంచ్లో ఉంటారు చియాన్. లాస్ట్ ఇయర్ మూడు సినిమాలు చేశారు చియాన్. అందులో కోబ్రాలో ఆయన ఎంత కష్టపడ్డారో ప్రజలందరికీ కళ్లకు కట్టినట్టు అర్థమైంది. కానీ నెగటివ్ రివ్యూల కారణంగా సినిమాకు కలెక్షన్లు రాలేదు. 2022లో విక్రమ్కి జబర్దస్త్ హిట్ ఇచ్చింది పొన్నియిన్ సెల్వన్. మన దగ్గర ఈ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ, తమిళనాడులో మాత్రం 500 కోట్ల మార్కు దాటేసింది. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 విడుదలకు సిద్ధమవుతోంది.
దాంతో పాటు తంగలాన్ కోసం విక్రమ్ స్పెషల్గా యాస నేర్చుకుంటున్నారట. అసలే పా.రంజిత్ సినిమాలకు స్పెషల్ ఆడియన్స్ ఉంటారు. విక్రమ్ సినిమాల కోసం వెయిట్ చేసే మూవీ లవర్స్ కూడా ఎక్కువే. ఇప్పుడు వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటేనే బజ్ బాగా సౌండ్ చేస్తోంది.