'లైగర్' ఇలా వచ్చాడు.. అలా వెళ్లాడు! ఫ్యాన్స్ నిరాశ చెందారు!!
on Jan 31, 2022

ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'భామా కలాపం'. ఆహా ఓటీటీలో ఫిబ్రవరి 11న నేరుగా విడుదలవుతోంది. 'డియర్ కామ్రేడ్' డైరెక్టర్ భరత్ కమ్మా ప్రెజెంటర్గా వ్యవహరిస్తోన్న ఈ మూవీకి ఆయన శిష్యుడు అభిమన్యు దర్శకత్వం వహించాడు. ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్పై బాపినీడు, సుధీర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్ను సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని పార్క్ హ్యాత్లో జరిగిన ఈవెంట్లో లైగర్ విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు.
విజయ్ దేవరకొండ వేదిక వద్దకు రాగానే అతనిపై ఒక ఆడియో విజువల్ను ప్రదర్శించారు. ఆ తర్వాత అతను 'భామాకలాపం' ట్రైలర్ను లాంచ్ చేశాడు. భరత్ కమ్మ, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడాక యాంకర్ శ్యామల యూనిట్ మొత్తాన్ని స్టేజ్పైకి ఆహ్వానించింది. ఆ వెంటనే విజయ్ మైక్ అందుకున్నాడు. "భరత్ కమ్మ 'బైసైకిల్' అనే ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. అది చూసినప్పట్నుంచీ అతని డైరెక్షన్లో సినిమా చెయ్యాలని వెంటపడ్డాను. అలా 'డియర్ కామ్రేడ్' చేశాం. ఆ సినిమా నాకు చాలా స్పెషల్. ఆ సినిమా రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అభిమన్యు ఇప్పుడు 'భామా కలాపం'ను డైరెక్ట్ చేశాడు. ప్రియమణిగారు ఏ లాంగ్వేజ్లో చేస్తే ఆ లాంగ్వేజ్ యాక్టర్లా అనిపిస్తారు. 'ద ఫ్యామిలీ మ్యాన్'లో ఆమె నటన నాకు చాలా నచ్చింది. 'భామా కలాపం' ద్వారా ఆహాలోకి వస్తున్నందుకు హ్యాపీ. ఫిబ్రవరి 11న నేనూ ఆ మూవీని చూస్తాను" అని చెప్పాడు విజయ్.
4 నిమిషాల తన స్పీచ్లో చివరగా ఫ్యాన్స్కు కిస్సులు ఇచ్చి, అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. మొత్తం మీద 20 నిమిషాల కంటే ఎక్కువసేపు అతను ఉండకపోవడంతో అతని కోసం వచ్చిన ఫ్యాన్స్ నిరాశచెందారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



