ENGLISH | TELUGU  

'భీమ్లా నాయక్' విడుదలపై వీడని సస్పెన్స్.. మళ్ళీ వాయిదా తప్పదా?

on Jan 31, 2022

కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సినిమాల విడుదలపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. మార్చి 11 న 'రాధేశ్యామ్', మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్', ఏప్రిల్ 28 న 'ఎఫ్-3', ఏప్రిల్ 29 న 'ఆచార్య', మే 12 న 'సర్కారు వారి పాట' విడుదల కానున్నాయి. అయితే 'భీమ్లా నాయక్' విడుదల తేదీపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పరిస్థితిని బట్టి ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న సినిమా విడుదల చేస్తామంటూ మేకర్స్ సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు.

నిజానికి భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కావాల్సి ఉంది. అయితే జనవరి 7 న 'ఆర్ఆర్ఆర్' విడుదల ఉండటంతో.. ఆ మూవీ మేకర్స్ రిక్వెస్ట్ తో భీమ్లా నాయక్ ఫిబ్రవరికి వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తో ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న మూవీని విడుదల చేస్తామని ప్రకటించిన ఆర్ఆర్ఆర్ మేకర్స్ తాజాగా మార్చి 25 న విడుదల చేస్తామంటూ కొత్త తేదీని ప్రకటించారు. దీంతో ఏప్రిల్ 1 న విడుదల కావాల్సిన ఆచార్య ఏప్రిల్ 29 కి వెళ్ళిపోయింది.

ఫిబ్రవరి 25 న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ ఏప్రిల్ 1 కి వాయిదా పడే అవకాశముందని ఇటీవల న్యూస్ వినిపించింది. అందుకు తగ్గట్లే ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న సినిమాని విడుదల చేస్తామంటూ భీమ్లా నాయక్ మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే ఫిబ్రవరి 25 నే భీమ్లా నాయక్ ని విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 1 కి వారం ముందు మార్చి 25 న ఆర్ఆర్ఆర్ వస్తుండటంతో.. గతంలో మాదిరి మళ్ళీ ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ తో భీమ్లా నాయక్ వాయిదా పడుతుందేమోనన్న ఆందోళన వారిలో నెలకొంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.