విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్తో మాట్లాడాను కానీ...
on May 16, 2020
తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ 'దొరసాని' తీసిన కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో సొంత ప్రొడక్షన్ హౌస్ కింగ్ అఫ్ హిల్ బ్యానర్ లో యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే, "విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్తో మాట్లాడాను. కానీ, ప్రస్తుతానికి ఏ ప్రొడక్షన్ హౌస్ కి ఈ వెబ్ సిరీస్ సంబంధం లేదు" అని కెవిఆర్ మహేంద్ర చెబుతున్నాడు.
"వెబ్ సిరీస్ స్క్రిప్ట్ కంప్లీట్ చేశా. హిస్టారికల్ డ్రామాగా రాశా. 1948 బ్యాక్డ్రాప్లో సాగుతుంది. బేసిక్ ఐడియాగా ఉన్నప్పుడు కింగ్ అఫ్ హిల్ ప్రొడక్షన్కి ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాను. అప్పటి నుండి వాళ్లతో టచ్ లో ఉన్నాను. అయితే అఫీషియల్ గా ఇప్పుడే ఏమీ చెప్పలేను. ప్రొడక్షన్ హౌస్ ఏదీ చెప్పలేను" అని కెవిఆర్ మహేంద్ర తెలిపాడు.