వచ్చే దీపావళి లేదా సంక్రాంతికి విజయ్-వంశీ పైడిపల్లి సినిమా విడుదల
on Jan 24, 2022
తమిళ స్టార్ యాక్టర్ విజయ్ హీరోగా నటిస్తోన్న 'బీస్ట్' మూవీ షూటింగ్ పూర్తయింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి పనిచేయడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. నిర్మాత దిల్ రాజు చెప్పిన దాని ప్రకారం #Thalapathy66 మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ మూవీని ఈ ఏడాది దీపావళికి కానీ లేదా 2023 సంక్రాంతికి కానీ విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
Also read: ఓటీటీలోనూ 'అఖండ' జాతర
విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని నిర్మించనున్నట్లు గత ఏడాది సెప్టెంబర్లో దిల్ రాజు ఎనౌన్స్ చేశారు. ఆ సినిమాకి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టాప్ యాక్టర్స్, టెక్నీషియన్స్ పనిచేస్తారని ఆయన చెప్పారు. ఒక టీవీ చానల్కు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో, "వంశీ ఒక బ్యూటిఫుల్ స్టోరీని రెడీ చేశాడు. వినగానే నాకు బాగా నచ్చేసింది. విజయ్కు ఆ కథ చెప్పినప్పుడు, గత 20 ఏళ్ల కాలంలో తను విన్న బెస్ట్ స్టోరీ ఇదేనని చెప్పారు. ఒక స్టార్ అలా చెప్పారంటే, అది మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మార్చిలో సినిమా షూటింగ్ మొదలవుతుంది. కొవిడ్ 19 కారణంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకపోతే దీపావళికి సినిమాని రిలీజ్ చేస్తాం. అది మిస్సయితే, 2023 సంక్రాంతికైనా రిలీజ్ చేస్తాం" అని ఆయన వెల్లడించారు.
Also read: బాలయ్య-గోపీచంద్ సినిమాలో కీలక పాత్రలో అజయ్ ఘోష్!
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్తో కలిసి ఆయన ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రి-ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.