ENGLISH | TELUGU  

మీడియా ఆ విషయాన్ని చూపించలేదు.. పవన్ నాతో ఆ మాట చెప్పారు: విష్ణు

on Oct 18, 2021

బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 'మా' అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో వేదికపై పక్కపక్కనా కూర్చున్నా ఇద్దరూ మాట్లాడుకోలేదని, విష్ణుని పవన్ పట్టించుకోలేదని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను తాజాగా మంచు విష్ణు ఖండించారు.

పవన్ కళ్యాణ్ గారు, తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని.. తమ మధ్య విభేదాలు లేవని విష్ణు తెలిపారు. స్టేజ్ పైకి వెళ్లక ముందు తామిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నామని.. ఆ విషయాన్ని మీడియా చూపించలేదని అన్నారు. పవన్ సహాయ సహకారాలు కూడా 'మా'కు కావాలని విష్ణు అన్నారు. 'మా' మన తల్లివంటిదని.. జాగ్రత్తగా చూసుకోమని పవన్ తనతో చెప్పారని వెల్లడించారు. అంతేకాకుండా తన తండ్రి మోహన్‌బాబు- చిరంజీవి నిన్న ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు విష్ణు తెలిపారు.

కాగా, రాజకీయ ఎన్నికలను తలపించిన 'మా' అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కి ఉండటం, ప్రచారంలో పవన్ పేరుని ప్రస్తావించి విమర్శలు చేయడం, ప్రకాష్ రాజ్ ఓటమి తర్వాత మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పవన్ విష్ణుని అసలు పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. దీంతో విష్ణు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.