నటుడు గిరిబాబుకు సతీవియోగం..!
on May 12, 2016
.jpg)
ప్రముఖ సినీనటుడు గిరిబాబుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య ఎర్ర శ్రీదేవి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో నిన్న అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. గిరిబాబు-శ్రీదేవి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు రఘుబాబు ప్రముఖ కమెడీయన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి మృతదేహాన్ని గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



