టీ20 ప్రపంచకప్ ఫస్ట్ మ్యాచ్.. హోరాహోరీ పోరులో ఆసీస్ విజయం
on Oct 23, 2021
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ నేడు(అక్టోబర్ 23) ప్రారంభమైంది. టీ20 ప్రపంచకప్ కోసం 12 జట్లు తలపడుతుండగా.. మొదటి మ్యాచ్ గ్రూప్-1 లోని ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య శనివారం జరిగింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
సౌత్ ఆఫ్రికా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కి దిగింది. ఆస్ట్రేలియా బౌలర్ల సమిష్టి కృషితో సౌత్ ఆఫ్రికా టోటల్ స్కోర్ 118కే పరిమితమైంది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ లో మర్క్రం(36 బంతుల్లో 40) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా. 119 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను సౌత్ ఆఫ్రికా బౌలర్స్ బాగానే ఇబ్బంది పెట్టారు. డేవిడ్ వార్నర్ తో కలిసి ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ ఫించ్ డకౌట్ అయ్యాడు. వార్నర్(14), మిచెల్ మార్ష్(11), మాక్స్ వెల్(18) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. స్మిత్(35) రాణించి జట్టుని గెలుపు దిశగా నడిపించాడు. స్టోయినిస్(24 నాటౌట్), వేడ్ (15 నాటౌట్) నిలబడి జట్టుకి విజయాన్ని అందించారు. రెండు బాల్స్ మిగిలి ఉండగా 119 లక్ష్యాన్ని చేదించిన ఆస్ట్రేలియా(121-5/19.4).. సౌత్ ఆఫ్రికాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
నాలుగు ఓవర్లకు 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్ వుడ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
Also Read