శ్రీదేవి కాపురంలో నిప్పులు పోస్తున్న కూతురు
on Apr 13, 2017
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీకపూర్ జంట మధ్య కలతలు వస్తున్నాయా అంటే అవుననే అంటోంది బీ-టౌన్ మీడియా. అది కూడా కూతురు జాహ్నవి వల్లనే ఇద్దరి మధ్యే గ్యాప్ పెరుగుతోందట. అసలు మ్యాటర్ ఏంటంటే..జాహ్నవిని సినీరంగ ప్రవేశం చేయించాలని శ్రీదేవి ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఓ టాప్ డైరెక్టర్ చేత పెద్ద బ్యానర్లో, టాప్ హీరో పక్కన కూతురి అరంగేట్రం చేయించాలన్నది శ్రీదేవి ఆశ.
అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది..తండ్రి బోనీ కపూర్కి కూడా కూతురి విషయంలో అలాంటి ఆశలుండటంతో ఆయన కూడా బోలెడన్ని ప్లాన్లు వేసుకున్నారు. కూతురు నటించే మొదటి సినిమాను తాను నిర్మించాలన్నది బోనీ డ్రీమ్. ఇక్కడే భార్యభర్తలకి చెడిందంటున్నారు. బోనీ బ్యానర్లో జాహ్నవి నటిస్తే కెరీర్ స్టార్టింగ్లోనే అట్టర్ ఫ్లాప్ అవుతుందని శ్రీదేవి భయపడుతోందట..కూతురి విషయంలో కలగజేసుకోవద్దని అతిలోక సుందరి, తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాలంటూ బోనీ ప్రతిరోజూ గొడవ పడుతున్నారట..అయితే జాహ్నవి భవిష్యత్తు కోసం రాజీ పడేది లేదని..ఇద్దరూ భీష్మించుకుని కూర్చోవడంతో ఇది ఎంతవరకు వెళుతుందోనని అంటున్నారు బాలీవుడ్ జనాలు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
