బ్రహ్మానందానికి కాలక్షేపం దొరికింది
on Apr 13, 2017
సుమారు మూడు దశాబ్ధాల పాటు తెలుగువారిని తనదైన నటనతో కడుపుబ్బా నవ్విస్తోన్న కామెడీ కింగ్ బ్రహ్మానందానికి కొత్త ప్రమోషన్ వచ్చింది. ఆయనకు తాతగా కొత్త హోదా వచ్చింది. ఆయన తనయుడు గౌతమ్-జోత్స్న దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. పండగ రోజు మా ఇంట్లో మరింత ఆనందం వెల్లివిరిసింది. నా మనవడి రాకతో మా ఇల్లు సంతోషవనమైంది అంటూ బ్రహ్మానందం తన ఆనందాన్ని పంచుకున్నారు. పల్లకిలో పెళ్లికూతురు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు గౌతమ్. ఆ తర్వాత "బసంతి"లో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఫణీంద్ర అనే యువ దర్శకుడి దర్శకత్వంలో "మను" అనే చిత్రంలో నటిస్తున్నారు గౌతమ్. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.