'టైగర్ నాగేశ్వరరావు'లో హేమలతా లవణం.. రేణు దేశాయ్!
on Sep 29, 2022

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు. 1970ల కాలంలో స్టువర్ట్పురం గజదొంగగా పేరుపొంది, సంపన్నులకు నిద్రలేకుండా చేసిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్గా ఈ సినిమా రూపొందుతోంది.
కాగా, ఈ సినిమా కథలో సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త, రచయిత్రి, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి హేమలతా లవణం పాత్ర కూడా కీలకం. ఆ పాత్రను రేణు దేశాయ్ చేస్తున్నారు. ఆ పాత్రను పరిచయం చేస్తూ ఈరోజు నిర్మాతలు ఓ చిన్న వీడియో గ్లింప్స్ను విడుదల చేశారు. ధవళ వర్ణ వస్త్రాలు ధరించిన హేమలతగా మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఆ గ్లింప్స్లో పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు రేణు. జి.వి. ప్రకాశ్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆ క్యారెక్టర్ను ఎలివేట్ చేస్తోంది. జానీ మూవీ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించని రేణు.. 18 సంవత్సరాల తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు'తో రిఎంట్రీ ఇస్తున్నారు.
ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నారు.
ఆర్. మది సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా మాటలు అందిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



