అప్పుడు మహేశ్ తో.. ఇప్పుడు విజయ్ తో..!
on Jun 22, 2022
`ఛలో` (2018)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ కస్తూరి రష్మికా మందన్న.. అనతి కాలంలోనే ఇక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకులకు జోడీగా అలరించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూనే.. బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే, కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ కి జోడీగా రష్మిక ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో `వారసుడు`, తమిళంలో `వారిసు` పేరుతో రూపొందుతున్న ఈ బైలింగ్వల్ మూవీ.. 2023 పొంగల్ స్పెషల్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో మహేశ్ బాబు కాంబినేషన్ లో రష్మిక నటించిన `సరిలేరు నీకెవ్వరు` (2020) కూడా సంక్రాంతి సినిమాగానే విడుదలై ఘనవిజయం సాధించింది. కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత ఇప్పుడు అదే సీజన్ లో రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది మిస్ మందన్నా. మరి.. మహేశ్ లాగే విజయ్ కూడా రష్మికా మందన్నకి పొంగల్ బ్లాక్ బస్టర్ అందిస్తాడేమో చూడాలి.
కాగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్నాడు.
Also Read