రమ్యకృష్ణను ద్రౌపదిగా ఎందుకు తీసుకోలేదంటే..?
on Apr 21, 2020
భారతీయ బుల్లితెర చరిత్రలో ‘మహాభారత్’ సీరియల్ ఒక అద్భుతం. ఎందరో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, చరిత్ర సృష్టించింది. పలు సంచలనాలు నమోదు చేసింది. అందులో నటించిన నటీనటులకు ఎంతో పేరు తీసుకొచ్చింది. అయితే... ఆ అద్భుతాన్ని అంచనా వేయడంలో విఫలమైన కొందరు, అందులో నటించలేదు. సినిమాల కోసం ఆ సీరియల్ వదులుకున్నారు. అభిమన్యు పాత్రలో నటించడానికి హిందీ నటులు గోవిందా, చుంకీ పాండే అగ్రిమెంట్లు మీద సంతకాలు కూడా చేశారు. అయితే... సినిమాల్లో అవకాశాలు రావడంతో ‘మహాభారత్’ సీరియల్లో నటించడానికి ‘నో’ చెప్పారు.
ద్రౌపది పాత్రలో నటించడానికి మొదట ఆసక్తి చూపించిన జుహీ చావ్లా, తర్వాత సినిమాల్లో ఛాన్సులు రావడంతో సీరియల్ను వదులుకున్నారు. పలువుర్ని ఆడిషన్ చేశాక... చివరకు రూపా గంగూలీ, రమ్యకృష్ణను ఫైనలైజ్ చేశారు. ఇద్దరిలో రూపది నార్త్ ఇండియా. రమ్యకృష్ణది సౌతిండియా. రూపకు హిందీ భాష మీద పట్టు ఉండడంతో ద్రౌపది పాత్ర ఆమెకు ఇచ్చారు. లేదంటే రమ్మకృష్ణ ఆ సీరియల్ చేసేవారు. అదీ సంగతి! ఇప్పుడు దూరదర్శన్ ఛానల్లో ఆ సీరియల్ మళ్లీ టెలీకాస్ట్ అవుతున్న సందర్భంగా అప్పడు జరిగిన సంగతులు మళ్లీ బయటకు వస్తున్నాయి.