ENGLISH | TELUGU  

అనుష్కకు ప్రొడక్షన్‌ హౌస్‌ సపోర్ట్‌

on Apr 21, 2020

 

బహుశా... ఈమధ్య కాలంలో హీరోయిన్‌ మీద పుకారు వస్తే ప్రొడక్షన్‌ హౌస్‌ రియాక్ట్‌ అవ్వడం ఎవరూ ఎరుగరు. హీరోలపై పుకార్లు వస్తేనే స్పందించడం లేదు. ఇక, హీరోయిన్లను ఎక్కడ పట్టించుకుంటారు చెప్పండి! అయితే... ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరొందిన అనుష్కపై పుకార్లు రావడంతో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ స్పందించినట్టు వుంది. అసలు వివరాల్లోకి వెళితే... అనుష్క మెయిన్‌ రోల్‌ చేసిన లేటెస్ట్‌ సినిమా ‘నిశ్శబ్దం’. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ నిర్మించాయి. మెజార్టీ షేర్‌ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీదే అని టాక్‌.

కరోనా రావడం, లాక్‌డౌన్‌ విధించడం, థియేటర్లు షట్‌డౌన్‌ కావడం లేకపోతే ఆల్రెడీ సినిమా రిలీజ్‌ అయ్యేది. మిగతా సినిమాలపై పడినట్టు ఈ సినిమాపైనా కరోనా ఎఫెక్ట్‌ పడింది. మిగతా సినిమాలకు వచ్చినట్టు ఈ సినిమాకూ ఓటీటీ నుండి ఆఫర్‌ వచ్చింది. థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీలో సినిమా విడుదల కావడం అనుష్కకు ఇష్టం లేదనీ.... అందుకని ఓటీటీకి సినిమా ఇవ్వడానికి అడ్డుపడుతుందనీ.... నిర్మాతల బాధలు తెలియకుండా వ్యవహరిస్తోందనీ కొందరు పుకార్లు సృష్టించారు. దాంతో పీపుల్స్‌ మీడియా ప్రొడక్షన్‌ హౌస్‌ రంగంలోకి దిగింది. అనుష్క తమకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉన్నారనీ, ఆమెపై వచ్చే పుకార్లు నమ్మవద్దనీ తెలిపింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.