'నా సంతకం ఫోర్జరీ చేశారు'.. నట్టి కుమార్ పిల్లలపై వర్మ ఫిర్యాదు
on May 28, 2022
వివాదాలతో నిత్యం సహవాసం చేస్తుండే రాంగోపాల్ వర్మ ఇటీవల నిర్మాత నట్టి కుమార్తో వివాదంతో మరోసారి వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఆ వివాదానికి సంబంధించి తాజాగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ నట్టి కుమార్ కుమారుడు క్రాంతి, కుమార్తె కరుణపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీఐ నిరంజన్రెడ్డికి అందజేసిన ఫిర్యాదులో.. 2020 నవంబర్ 30న తన లెటర్హెడ్ తీసుకున్న ఆ ఇద్దరూ దానితో నకిలీ పత్రాల్ని సృష్టించి, ఫోర్జరీ సంతకంతో వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్లుగా కల్పించారని ఆరోపించారు. తను తీసిన డేంజరస్ అనే సినిమా విడుదలను ఆపడానికే వారు ఈ డ్రామా నడుపుతున్నారని తెలిపారు. ఏప్రిల్ 8న 'డేంజరస్' (తెలుగులో 'మా ఇష్టం') సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లూ చేసుకోగా, ఆ సినిమా ఆపాల్సిందిగా 7వ తేదీ కోర్టు స్టే విధించిందని అందులో తెలిపారు. కోర్టు డాక్యుమెంట్ చూశాక, తన సంతకం ఫోర్జరీ చేసి నట్టి క్రాంతి, నట్టి కరుణ తప్పుడు పత్రాలు సృష్టించారని అర్థమైందనీ, అందుకే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాననీ వర్మ వెల్లడించారు. తన సంతకం ఉన్న డాక్యుమెంట్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి, అది ఫోర్జరీయో, నిజమైందో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read