ENGLISH | TELUGU  

20 నుంచి సెట్స్‌పై పవన్ కల్యాణ్ సినిమా

on Jan 8, 2020

 

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ జనవరి 20 నుంచి హైదరాబాద్‌లో జరగనున్నది. హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ క్యారెక్టర్‌ను తెలుగులో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. నానితో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' వంటి హిట్ మూవీని తీసిన శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసే ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బేనర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. లైంగిక హింసకు గురై, న్యాయం కోసం పోరాడే ముగ్గురు యువతుల కథగా రూపొందే ఈ సినిమాలో ఆ యువతులుగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ('మల్లేశం' మూవీ నాయిక) నటిస్తున్నారు. అంటే హిందీలో తాప్సీ, తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రలో నివేదా కనిపిస్తుందన్న మాట. 

కొంతమంది యువకుల అరాచకానికి బాధితులుగా మారిన ఆ ముగ్గురు యువతుల తరపున కోర్టులో వాదించే లాయర్‌గా పవన్ కల్యాణ్ ఒక భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. హిందీలో అమితాబ్, తమిళంలో అజిత్ ఆ పాత్రలో గొప్పగా రాణించారు. కోర్టులో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి. ఆయన ఎలా ఆ డైలాగ్స్ చెబుతారా.. అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమాని పూర్తిచేయడానికి దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. 2018లో వచ్చిన డిజాస్టర్ మూవీ 'అజ్ఞాతవాసి' తర్వాత రాజకీయాలపైనే ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్.. రెండేళ్ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టీ దీనిపై ఉంది. కేవలం 15 రోజుల కాల్షీట్స్‌కు ఆయన రూ. 50 కోట్లు అందుకుంటున్నారనే ప్రచారం ఫిలింనగర్‌లో నడుస్తోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.