మదర్ సెంటిమెంట్ తో `వాలిమై`
on Jun 22, 2021
`తల` అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `వాలిమై`. `ఖాకి` ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ చిత్రంలో అజిత్.. సీబీసీఐడి (క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) అధికారి పాత్రలో దర్శనమివ్వనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అజిత్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నటిస్తుండగా.. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. స్టార్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ భారీ బడ్జెట్ మూవీకి బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. `వాలిమై` ప్రధానంగా యాక్షన్ ఎంటర్టైనర్ అయినప్పటికీ కథానుసారం `మదర్ సెంటిమెంట్`కి కూడా ఎంతో స్కోప్ ఉందట. సీనియర్ యాక్ట్రస్ సుమిత్ర ఇందులో అజిత్ కి తల్లి పాత్రలో నటిస్తోందని.. అజిత్, సుమిత్ర మధ్య సాగే సన్నివేశాలు ఎమోషనల్ గా కదిలించేలా ఉంటాయని టాక్. అంతేకాదు.. సందర్భానుసారం వచ్చే అమ్మ పాట కూడా ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. మరి.. `వాలిమై`కి ఈ మదర్ సెంటిమెంట్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, చిత్రీకరణ తుది దశకు చేరుకుంటున్న `వాలిమై`ని.. దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని వినోద్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం.