ఫ్యాన్స్కు 'ఆర్ఆర్ఆర్' మాసివ్ న్యూస్!
on Jan 19, 2021
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్రం షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూట్ మొదలైంది. అత్యంత భారీ స్థాయిలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు (చరణ్), కొమరం భీమ్ (తారక్) కలిసి విలన్లపై వీరోచితంగా పోరాడే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్ అవుతుందని సమాచారం. నిజానికి ఈ సీన్లు ప్రేక్షకుల రోమాలను నిక్కబొడుచుకొనేలా చేస్తాయని యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం.
రామరాజు, భీమ్ రక్తపు చారికలతో నిండిన చేతులను పట్టుకొని ఉన్న పిక్చర్ను షేర్ చేసిన మూవీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్, "The MASSIVE CLIMAX shoot has begun! Mighty Bheem and Fiery Ramaraju are set to accomplish what they desired to achieve, together. A BIG SCREEN ExtRRRavaganza is coming your way." అంటూ రాసుకొచ్చింది. అదే న్యూస్ను డైరెక్టర్ రాజమౌళి కూడా షేర్ చేశారు.
చరణ్కు జోడీగా అలియా భట్, తారక్ సరసన ఒలీవియో మోరిస్ నటిస్తోన్న ఈ చిత్రంలో అజయ్ దేవ్గణ్, సముద్రకని, శ్రియ కీలక పాత్రలు ధరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తుండగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.