దసరా నుంచి దీపావళికి.. అక్టోబర్ 21న రానున్న 'జిన్నా'
on Sep 29, 2022

మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య హెల్మ్ దర్శకుడు. పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటించారు. మూలకథను జి. నాగేశ్వర్ రెడ్డి సమకూర్చగా, కోన వెంకట్ స్క్రిప్ట్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు సూర్య మాట్లాడుతూ, "నేను మోహన్ బాబు గారి సంస్థ లో సినిమా చేస్తానని అనుకోలేదు. నాకు అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది, పెద్ద హిట్ అవుతుంది" అన్నారు.
జి. నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, "జిన్నా చిత్రం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 21న విడుదల అవుతుంది. విష్ణు కెరీర్ లో ఎంటర్టైన్మెంట్ చిత్రాలు అన్నీ బ్లాక్బస్టర్ లే . ఈ చిత్రం కూడా బ్లాక్బస్టర్ అవుతుంది. దర్శకుడు సూర్య చాలా బాగా చేశాడు. ఇంత పెద్ద కాస్టింగ్ తో సినిమా చేయడం చాలా కష్టం. కానీ ఫస్ట్ కాపీ చూసాక బ్లాక్ బస్టర్ సినిమా రెడీ అయింది అని అనుకున్నాను. నేను ఈ సినిమాని డైరెక్ట్ చేయలేదని బాధపడను. మోహన్ బాబు గారి బలమే మహిళా ప్రేక్షకులు, మాస్ ప్రేక్షకులు. ఈ చిత్రం మహిళలకి సూపర్ గా నచ్చుతుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా అద్భుతంగా ఉంటుంది. కొత్త సన్నీ లియోన్ ని చూస్తారు. విష్ణు పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటుంది. చాలా రిస్కీ షాట్స్ చేశారు, డాన్స్ ఇరగదీసాడు, ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది" అని చెప్పారు.
మంచు విష్ణు మాట్లాడుతూ, "మా 'జిన్నా' చిత్రం అక్టోబర్ 21న విడుదల అవుతుంది. చాలా కష్టపడి చిత్రాన్ని నిర్మించాం. జి నాగేశ్వర రెడ్డి మూల కథ అందిస్తే, కోన వెంకట్ దాన్ని డెవలప్ చేశారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 5న విడుదలవుతుంది. మా అందరికి ఇది ఒక అద్భుతమైన జర్నీ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుంది" అని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



