మోహన్బాబు సింహాసనంలో ప్రత్యేకత ఏంటంటే?
on Mar 20, 2020
పుట్టినరోజు (గురువారం, మార్చి 19)న మోహన్బాబు ఓ ప్రత్యేక బహుమతి అందుకున్నారు. అదేంటో తెలుసా? మీరు చూస్తున్న ఫొటోలోని సింహాసనం. దీన్ని లక్ష్మీ మంచు తయారు చేయించారట. ఈ సింహాసనానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అందులో మూడు సింహాలు ఉన్నాయి కదా! మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు... లక్ష్మి, విష్ణు, మనోజ్. ఆ ముగ్గుర్ని రిప్రజెంట్ చేయడానికి మూడు సింహాలు అన్నమాట.
ప్రతి ఏడాది తిరుపతిలోని విద్యానికేతన్ ఆవరణలో మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు, విద్యానికేతన్ వార్షికోత్సవం జరగడం ఆనవాయితీ. కరోనా కారణంగా ఈ ఏడాది ఆయన పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ లోని కుటుంబ సభ్యుల మధ్య ఉన్నారు. కరోనా కారణంగా ఫ్యామిలీ అందరూ ఇంటికి పరిమితం అయ్యారు. సెల్ఫ్ క్వారంటైన్ అన్నమాట.