మళ్ళీ సంక్రాంతికే మహేశ్-త్రివిక్రమ్ సినిమా!?
on Jan 23, 2022
ప్రీవియస్ మూవీ `అల వైకుంఠపురములో`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 2020 సంక్రాంతికి రిలీజైన సదరు ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఆ యేటి మేటి గ్రాసర్ గానూ రికార్డులకెక్కింది. కట్ చేస్తే.. తన నెక్స్ట్ వెంచర్ తోనూ పొంగల్ సీజన్ లో సందడి చేయనున్నారట త్రివిక్రమ్. ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు` (2005), `ఖలేజా` (2010) వంటి కల్ట్ క్లాసిక్స్ తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. అంతేకాదు.. త్వరితగతిన సినిమాని పూర్తిచేసి, 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also read: మహేష్, చరణ్ ల మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
కాగా, `అల వైకుంఠపురములో`లో నాయికగా నటించిన `బుట్టబొమ్మ` పూజా హెగ్డే, స్వరాలు సమకూర్చిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్.. మహేశ్ - త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ లోనూ భాగం కానున్నారు.
Also read: 'శ్రీమంతుడు' విలన్ రెండో పెళ్లి!
ఇదిలా ఉంటే... ప్రస్తుతం `సర్కారు వారి పాట`తో మహేశ్ బాబు, `భీమ్లా నాయక్`తో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 25న త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చిన `భీమ్లా నాయక్` రిలీజ్ కానుండగా.. అన్నీ అనుకూలంగా ఉంటే ఏప్రిల్ 1న `సర్కారు వారి పాట` థియేటర్స్ లోకి రానుంది.
Also Read