మిస్టరీగా మారిన లెజెండరీ సింగర్ వాణీ జయరాం మరణం!
on Feb 5, 2023
లెజెండరీ సింగర్ వాణీ జయరాం మరణం చుట్టూ పలు అనుమానాలు నెలకొన్నాయి. అదొక మిస్టరీగా మారింది. చెన్నైలోని నాగంబాకంలో గల సొంత ఇంటిలో వాణి జయరాం ప్రమాదానికి గురి అయ్యారు. దాంతో ఆమె మరణంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకోవడం మరిన్ని సందేహాలకు కారణమైంది. వాణి జయరామ్ ఇంట్లోనే గ్లాస్ టేబుల్ మీద పడటంతో ఆమె ముఖానికి బలమైన గాయాలు అయినట్టు ప్రాథమిక సమాచారం. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరట. వాణిజయరాం ఒక్కరే ఉన్నారు. పనిమనిషి వచ్చి తలుపు కొట్టగా వాణీ జయరామ్ ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో బంధువులకు సమాచారం అందించగా వెంటనే వారు వచ్చారు. బంధువులు వచ్చి తలుపు తీసి ఇంట్లోకి వెళ్లేసరికి వాణి జయరాం రక్తపు మడుగులో ఉన్నారట. దాంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స చేయడం ప్రారంభించారు. కొంతసేపటికి తుది శ్వాస విడిచారని తెలిసింది. పనిమనిషి చెప్పిన ఆధారాలు ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వాణి జయరాం రక్తపు మడుగులో పడి ఉండడంతో అనుమానాలకు కారణం అవుతుంది. కాలుజారి పడటం జరిగిందా లేదంటే ఇంట్లోకి ఎవరైనా చొరబడి ఏమైనా చేశారా అనేది తెలియాల్సి ఉంది.
వాణి జయరాం అస్సలు పేరు కలైవాణి. తమిళనాడులోని వెల్లూరులో అయ్యంగార్ కుటుంబంలో నవంబర్ 301945లో జన్మించారు. కర్ణాటక సంగీతంలో చిన్నతనం నుంచి శిక్షణ తీసుకున్నారు. 8 ఏళ్ల వయసులో తొలి ప్రదర్శన ఇచ్చారు. చదువు పూర్తయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు. ఆమె మామగారు కూడా కర్ణాటక సింగర్. దాంతో ఆమెకు ప్రోత్సాహం లభించింది. గుడ్డి సినిమాతో వాణి జయరాం చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అందులోని తొలి పాటకు ఐదు అవార్డులు అందుకు అందుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ, భోజ్ పురి, ఒరియా, తులు భాషలో పాటలు పాడారు. ఐదు దశాబ్దాలు ప్రేక్షకులను అలరించారు. ఆమె 50 ఏళ్ల కెరీర్లో మొత్తంగా ఇరవై వేలకు పైగా పాటలు పాడారు. అందులో పాటలలో చాలా భాగం అద్భుతమైన పాటలు తెలుగులోనే ఉన్నాయి. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్ (తెలుగులో అంతులేని కథ) లో పాటకు గాను ఒకసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. మిగతా రెండుసార్లు ఆమెకు కె. విశ్వనాథ్ సినిమాల్లో పాటలకు జాతీయ అవార్డులు లభించాయి. ఆమె చిత్ర సీమకు చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మొన్న గణతంత్ర దినోత్సవం నాడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అది అందుకోకముందే ఆమె కన్నుమూయడం విశాదమని అభిమానులు, ప్రేక్షకులు విలపిస్తున్నారు.
వాణీ జయరాం దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలిగా ప్రసిద్ది చెందింది. ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఐదు దశాబ్దాలు తన హవా కొనసాగించింది. సుమారు 1000 పైగా సినిమాలలో 20 వేలకు పైగా పాటలు పాడింది. వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా ఆలపించింది. తన ఎనిమిదవ ఏటనే ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నది.
వివాహానంతరం భర్తతో ముంబయిలో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అలా ఆవిడ హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకుంది. స్వాతికిరణం, పెళ్లి పుస్తకం, అగ్ని నక్షత్రం, స్వర్ణకమలం ,ఆరాధన, శృతిలయలు, శ్రీశ్రీ శిరిడి సాయిబాబా మహత్యం, సీతాకోకచిలుక, సర్కస్ రాముడు, శుభోదయం, ఇది కథ కాదు, ఆవేశం, శంకరాభరణం, కరుణామయుడు, మరోచరిత్ర, అంతులేని కథ, సీతా కళ్యాణం, చెలియా, స్వప్నం వంటి చిత్రాలలో ఈమె పాటలు పాడింది.