పనిమనిషిని సన్మానించిన రెబల్ స్టార్!
on Oct 23, 2021
తమ ఇంట్లో గత 25ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం ఘనంగా సన్మానించింది. '25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్' అంటూ ఆమెతో కేక్ కట్ చేయించారు. అంతేకాకుండా, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఓ బంగారు గొలుసును కూడా ఆమెకి కానుకగా ఇచ్చినట్లు సమాచారం.
పనిమనిషి పద్మను సన్మానించి, కేక్ కట్ చేయించిన ఫోటోలను కృష్ణంరాజు కుమార్తె ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేశారు. '25 ఏళ్లుగా మాకోసం ఎంతో చేశారు. థాంక్యూ పద్మ ఆంటీ' అంటూ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పనిమనిషిని ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నారు అంటూ కృష్ణంరాజు కుటుంబాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read