మెగాతో నందమూరి కలవడం కష్టమేనా..?
on Oct 18, 2016
తెలుగు చిత్ర సీమలో మెగా, నందమూరి కుటుంబాలది ప్రత్యేకమైన స్థానం. ఎన్నో ఏళ్లుగా పరిశ్రమను తమ భుజాలపై మోస్తున్నాయి రెండు కుటుంబాలు. ఈ కుటుంబాల్లోని హీరోలు కలిసి సినిమా చేస్తే చూడాలని టాలీవుడ్తో పాటు యావత్ తెలుగు ప్రేక్షకుల కల. అయితే ఇన్నాళ్లకు కాలం కలిసివచ్చి నందమూరి కుటుంబం నుంచి కళ్యాణ్రామ్, మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరం తేజ్లు మల్టీస్టారర్ చేయబోతున్నట్టు ఫిల్మ్నగర్ వర్గాలు ప్రకటించాయి . ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో..కేఎస్ రామారావు నిర్మాతగా వ్యవహరించాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడం కష్టమే అంటున్నారు సినీ జనాలు.
ఎందుకంటే ఈ ఇద్దరు రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులు కావడంతో...స్క్రిప్ట్ సిద్ధం కావడం అంత సులభం కాదని..ఇద్దరిలో ఏ ఒక్కరిని తక్కువ చేసి చూపించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ని డీల్ చేయాలి. అందుకే కథ విషయంలో దర్శకనిర్మాతలు ఆచీతూచీ స్పందిస్తున్నారు. ఇదంతా కలిసి ప్రాజెక్ట్ని ఆలస్యం చేస్తున్నాయి. అన్నీ ఓకే అయితే వచ్చే సంవత్సరం ఈ కాంబో సెట్స్మీదకు వెళుతుందని ఫిల్మ్నగర్ టాక్.