ENGLISH | TELUGU  

రాజమౌళి భయపడ్డారు : శ్రీసింహ

on Dec 23, 2019

రాజమౌళి-కీరవాణి కుటుంబం నుంచి తొలిసారి హీరోగా ఒకరు వస్తున్నారు. 'మత్తు వదలరా' సినిమాతో కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇదే సినిమాతో కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సినిమాలో పాటలు లేవు. కేవలం నేపథ్య సంగీతం మాత్రమే అతడు చేశాడు. అందువల్ల ఈ సినిమా రాజమౌళి కీరవాణి కుటుంబానికి స్పెషల్ సినిమా అయ్యింది. వారసుల కోసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఫ్యామిలీ అంతా వచ్చింది. 

"సినిమా నాకు నచ్చింది. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు మా అబ్బాయి సినిమా కాబట్టి మాకు నచ్చిందేమో. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఎదురు చూస్తున్నా. సినిమా విడుదల అవుతున్న 25వ తేదీ షూటింగ్ కి సెలవు కాబట్టి తప్పకుండా చూస్తా" అని రాజమౌళి చెప్పారు. అసలు ఈ సినిమా చేయడానికి ముందు... మీరు హీరో అవుతున్నారని రాజమౌళి తెలిసినప్పుడు ఆయన రియాక్షన్ ఏమిటి? అని శ్రీ సింహను అడిగితే... "రాజమౌళి బాబాయ్ చాలా భయపడ్డారు. వేరే క్రాఫ్ట్ ఏదైనా అయితే అంత భయపడేవారు కాదేమో. హీరో కదా! ఎలా చేస్తానోనని టెన్షన్ పడ్డారు. మా ఫ్యామిలీ అంత సినిమా చూసే వరకు నేను టెన్షన్ పడ్డా. వాళ్లు చూసి బాగుందని చెప్పిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యా. ఇప్పటికీ టెన్షన్ ఉంది. హీరోగా తొలి సినిమా కాబట్టి" అని సమాధానం ఇచ్చారు. 

'మత్తు వదలరా' కథ అంతా రెండు రోజుల్లో జరుగుతుందట. 70 శాతం కథ ఒక్క రోజులో జరుగుతుందట. ప్రస్తుతం కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అందుకని కమర్షియల్ సినిమా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేశానని శ్రీ సింహా అన్నారు. నిద్రమత్తు కల కుర్రాడిగా ఆయన నటించారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.