కే విశ్వానాథ్ కి పవన్ కళ్యాణ్ అమూల్యమైన బహుమానం..
on Apr 26, 2017
కే విశ్వనాధ్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్బంగా ఆయనని అభినందించడానికి పవన్ కళ్యాణ్, తన అత్యంత సన్నిహితుడయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. అందరి లాగా కాసేపు ఏదో చెప్పేసి మీడియా ముందు హంగామా చేసి వెళ్లడం కాకుండా కే విశ్వనాధ్ కి ఒక అమూల్యమయిన బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఇరువురు. త్రివిక్రమ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ విశ్వనాధ్ గారి 12 క్లాసిక్ చిత్రాల్ని ఎంపిక చేసి, వాటిని ఓ డిస్క్లా రూపొందించాలనే ఆలోచనను తన ముందుంచాడని, ఆయా సినిమా నిర్మాతలు, దర్శకులతో రైట్స్ విషయంలో మాట్లాడి ఈ సంవత్సరంలో డిస్క్ ని విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. విశ్వనాధ్ గారి గురించి మాట్లాడే స్థాయి గాని, అనుభవం గాని తనకు లేవని, కేవలం పెద్దాయనని అభినందించడానికి వచ్చామని చెప్పారు. అసలు విశ్వనాధ్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే రావడం ఒక రకంగా అవార్డు లపై గౌరవం పెంచిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ తాను అన్నయ్య చిరంజీవి స్వయంకృషి సినిమా చేసేప్పుడు వీలయినప్పుడల్లా సెట్స్ కి వెళ్ళేవాన్నని గుర్తు చేసాడు. ప్రస్తుతం తమ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం తాలూకు పనుల్లో బిజీ గా ఉన్నప్పటికీ పవన్, త్రివిక్రమ్ కే విశ్వనాధ్ గారికి డిస్క్ రూపంలో అపూర్వమైన కనుక ఇవ్వడానికి సమయం వెచ్చించడం మంచి నిర్ణయం అని చెప్పొచ్చు.