ఎట్టకేలకు 'రాధే శ్యామ్'కు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు!
on Oct 20, 2020
ప్రభాస్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తోన్న 'రాధే శ్యామ్' మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. యూరప్ బ్యాక్డ్రాప్లో అందమైన ప్రేమకథతో తయారవుతున్న సినిమాగా దీన్ని దర్శక నిర్మాతలు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కొవిడ్-19 నిబంధనల మధ్యే ఇటలీకి వెళ్లి మరీ యూనిట్ షూటింగ్ జరుపుతోంది. ఆరేళ్ల క్రితం 'జిల్' సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తోన్న రెండో సినిమా ఇదే. యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
కాగా ఇప్పటివరకూ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలీక ప్రభాస్ ఫ్యాన్స్ తలబద్దలు కొట్టుకుంటూ వచ్చారు. ఏడాది క్రితమే షూటింగ్ మొదలైపోయినా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం నిన్నటి దాకా ఫైనలైజ్ కాకపోవడం గమనార్హం. ఈ కాలంలో అనేక పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు మంగళవారం మ్యూజిక్ డైరెక్టర్ పేరును నిర్మాతలు ప్రకటించారు. అతను యువకుడైన జస్టిన్ ప్రభాకరన్. తమిళ సినిమాల ద్వారా పాపులర్ అయిన జస్టిన్ తెలుగులో ఇదివరకు తెలుగులో 'డియర్ కామ్రేడ్' మూవీకి పనిచేశాడు. అయితే ఏ భాషలోనైనా ఒక భారీ బడ్జెట్ మూవీకి మ్యూజిక్ ఇవ్వనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అతడి మీద నమ్మకంతో డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఈ బాధ్యతలను అప్పగించాడు.
ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న "బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్" పేరిట మోషన్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నారు. అందులో జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ఎలా ఉండనున్నదో శాంపిల్ చూపించనున్నారు.