యాక్సిడెంట్లో కోమాలోకి వెళ్లిన తారక్ అభిమాని మృతి
on Jul 5, 2022
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, చావు బతుకుల మధ్య పోరాడుతూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని జనార్ధన్ ఈరోజు తుది శ్వాస విడిచాడు. శ్రీకాళహస్తికి చెందిన జనార్దన్కు జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. తన చేతి మీద NTR పేరును టాట్టూగా వేయించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కోమాలోకి వెళ్లిపోయాడు.
ఒక్కగానొక్క కొడుకు ఇలా ఆస్పత్రి బెడ్ పై చావుబతుకుల మధ్య ఉండటంతో అతని తల్లి ఎంతగానో రోదిస్తూ వచ్చింది. ఈ విషయం అభిమాన సంఘాల ద్వారా తారక్కు చేరడంతో ఆయన.. అభిమాని తల్లితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పాడు. మీ కుమారుడికి ఏమీ కాదని, తామంతా ఉన్నామనీ, అన్ని విధాలా ఆదుకుంటామనీ భరోసా ఇచ్చాడు.
అలాగే లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ అభిమాని దగ్గర ఉంచగా.. "నీకేం కాదు.. నీకు నేనున్నాను.. త్వరగా కోలుకొని వచ్చేసేయ్, మనం కలుద్దాం" అంటూ అభిమానికి ధైర్యం చెప్పాడు తారక్. ఇప్పుడు జనార్దన్ మృతి చెందడంతో అతని తల్లి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఆ కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఆదుకోనున్నట్లు తెలిసింది.
Also Read