నితిన్ లాగే శర్వానంద్ కి కూడా ప్లస్సయ్యేనా!
on Oct 25, 2021
తెలుగునాట అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ రష్మికా మందన్న. `ఛలో`తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి.. ఆపై `గీత గోవిందం`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలతో మంచి విజయాలు చూసింది. ప్రస్తుతం రష్మిక.. `పుష్ప`, `ఆడవాళ్ళు మీకు జోహార్లు` వంటి తెలుగు సినిమాల్లో మెయిన్ లీడ్ గా నటిస్తోంది. `పుష్ప`లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జంటగా దర్శనమివ్వనున్న మిస్ మందన్న.. `ఆడవాళ్ళు మీకు జోహార్లు`లో యంగ్ హీరో శర్వానంద్ సరసన సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. గతంలో `లై`, `ఛల్ మోహన్ రంగ`, `శ్రీనివాస కళ్యాణం` వంటి వరుస పరాజయాల్లో ఉన్న నితిన్.. రష్మికతో జోడీ కట్టిన `భీష్మ`తోనే మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. కట్ చేస్తే.. ప్రస్తుతం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`లో రష్మికకి జతగా నటిస్తున్న శర్వానంద్ కూడా వరుస పరాజయాల్లోనే ఉన్నాడు. `పడి పడి లేచే మనసు`, `రణరంగం`, `జాను`, `శ్రీకారం`, `మహాసముద్రం`.. ఇలా ఐదు వరుస ఫ్లాప్స్ తో వార్తల్లో నిలుస్తున్నాడు. మరి.. నితిన్ లాగే శర్వానంద్ కి కూడా `రష్మిక ఫ్యాక్టర్` ప్లస్సయి.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.