టీమిండియా ఓటమికి కారణం నాగబాబేనా?
on Oct 25, 2021
'ఈ రోజు టీమిండియా ఎందుకు ఓటమి పాలైంది? నాకు రియల్ రీజన్ ఏంటో ఇప్పుడే తెలిసింది' - ఇదీ ఓ నెటిజన్ నాగబాబు పోస్ట్ కింద చేసిన కామెంట్. ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అందుకు సినిమా సెలబ్రిటీలు ఏమీ అతీతం కాదు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ ప్రీతీ జింటా, మౌనీ రాయ్ తదితరులు మ్యాచ్ చూడటం కోసం దుబాయ్ వెళ్లారు. తండ్రీకుమారులు నాగబాబు, వరుణ్ తేజ్ కూడా వెళ్లారు. స్టేడియమ్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇండియా ఓడిన తర్వాత నాగబాబు కారణం అంటూ కొందరు విమర్శించారు.
ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ కు నాగబాబు మద్దతు ఇచ్చారు. ప్రకాష్ ఓడారు. ఇప్పుడు టీమిండియాకు మద్దతు ఇచ్చారు. ఓడింది. నాగబాబు ఐరన్ లెగ్ అన్నట్టు ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇంకొకరు 'అనుకున్నా' అని కామెంట్ చేశారు. అంటే... నాగబాబు వెళ్లారు కాబట్టి ఇండియా ఓడిందని అర్థం అన్నమాట. నాగబాబు దుబాయ్ వెళ్లకపోతే ఇండియా నెగ్గేదని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. 'మీరు పోయారు. మ్యాచ్ పోయింది' అని ఒకరు... ఈ విధంగా నాగబాబును ఆడుకుంటున్నారు. ఇండియా ఓటమికి ఆయన ఏం చేయగలరు? ఒకవేళ మ్యాచ్ నెగ్గితే... నాగబాబు ఖాతాలో వేస్తారా ఏంటి??