హీరో వేణు తొట్టెంపూడిపై కేసు పెట్టిన మహిళ..!
on Apr 10, 2016
కొన్నేళ్ల క్రితం కామెడీ చిత్రాలతో అలరించిన వేణు తొట్టెంపూడి ఈ మధ్య వెండితెరకు దూరమయ్యాడు. చివరిగా ఎన్టీఆర్ దమ్ము సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన వేణు ఆ తర్వాత కనిపించలేదు. లేటెస్ట్ గా ఈ నటుడు న్యూస్ లోకెక్కాడు. తాను ఇచ్చిన ఇంటి అడ్వాన్స్ తిరిగివ్వకుండా, తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఫాతిమా అనే మహిళ బంజారాహిల్స్ పిఎస్ లో కంప్లైంట్ చేసింది. ఇరానీ డాక్టర్ అయిన ఫాతిమా ఏడునెలల క్రితం బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10 లో వేణు ఇంటిని అద్దెకు తీసుకుంది. అడ్వాన్స్ గా ఎనభై ఎనిమిది వేలు చెల్లించిన ఫాతిమా, తాను ఇంటిని ఖాళీ చేస్తూ అడ్వాన్స్ తిరిగివ్వాలని వేణు దంపతుల్ని కోరింది. ఆమె అద్దెకు వచ్చిన తర్వాత, ఫ్లోర్ పై బీటలు వచ్చాయని వాటిని బాగుచేయించి అడ్వాన్స్ తీసుకోమని వేణు దంపతులు చెబుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా వేణు దంపతులు ఫాతిమాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.