ఆ రెండు సినిమాల ప్రభావం.. 'మసూద'ను విడుదల చేస్తున్న దిల్ రాజు
on Nov 9, 2022

'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన మూడో చిత్రం 'మసూద'. హారర్-డ్రామా ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ విషయం తెలిపేందుకు బుధవారం హైదరాబాద్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాతో పాలు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. "రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని. కొత్త నిర్మాత. 'మళ్లీరావా'తో గౌతమ్ని పరిచయం చేశాడు.. తర్వాత 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో స్వరూప్ని డైరెక్టర్గా, నవీన్ పోలిశెట్టిని హీరోగా పరిచయం చేశాడు. నవీన్కి ఆ సినిమా ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే. రాహుల్ అభిరుచిగల నిర్మాత. ఆ రెండు సినిమాల జర్నీ నాకు నచ్చి.. అప్పుడే రాహుల్కి మాటిచ్చాను.. తర్వాత నువ్వు నిర్మించే సినిమా మా ద్వారా రిలీజ్ చేద్దాం అని చెప్పాను. ఆయన నిర్మించిన 'మసూద' చిత్రాన్ని మా ఎస్వీసీ ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా టీజర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా, ఎగ్జయిటింగ్గా అనిపించింది. టీజర్ చూడగానే రాహుల్కి ఫోన్ చేసి చెప్పాను. ఈ సినిమాతో కూడా కొత్తవారిని పరిచయం చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా చూడబోతున్నాను. ఫైనల్ కాపీ చూసేందుకు ఐయామ్ వెయిటింగ్. రాహుల్తో అసోసియేట్ అవడం చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. నవంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాహుల్ తో పాటు 'మసూద' టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని అన్నారు.
చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. "దిల్ రాజు గారిది చాలా మంచి చెయ్యి.. నాది కూడా మంచి చెయ్యి.. రెండు మంచి చేతులు కలిస్తే గట్టిగా సౌండ్ వస్తుందని భావిస్తున్నాను. ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలు మా ద్వారా రావాలని కోరుకుంటున్నాను. మసూద విషయానికి వస్తే.. మూడు సంవత్సరాల కష్టమిది. మధ్యలో కోవిడ్ రావడంతో ఆలస్యమైంది. మొదటి నుంచి నేను చెబుతున్నట్లుగా.. కొత్త డైరెక్టర్స్ని ఐదుగురుని పరిచయం చేస్తున్న తరుణంలో.. ఇప్పుడు మూడవ దర్శకుడు సాయికిరణ్ని పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకి ఎందరో టాలెంటెడ్ పర్సన్స్ వర్క్ చేశారు. మధ్యలో వేరే అవకాశాలు వచ్చినా వెళ్లకుండా.. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు అంతగా నిలబడ్డారు కాబట్టే.. ఇంత మంచి సినిమా తీయగలిగాను. మంచి సినిమా అని ఎందుకు అంటున్నానంటే.. ఇంతకు ముందు నేను తీసిన రెండు సినిమాల విషయంలో నా టేస్ట్ ప్రేక్షకులకి నచ్చింది. ఆ నమ్మకంతో ఇది కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.
సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రశాంత్ ఆర్.విహారి, సినిమాటోగ్రాఫర్ గా నగేష్ బానెల్, ఎడిటర్ గా జెస్విన్ ప్రభు వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



