సుధా చంద్రన్కు సారీ చెప్పిన సిఐఎస్ఎఫ్!
on Oct 22, 2021
నర్తకి, నటి సుధా చంద్రన్కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) క్షమాపణలు తెలియజేసింది. విమాన ప్రయాణం చేస్తున్నప్పుడల్లా ఎయిర్పోర్ట్లో ప్రతిసారీ సెక్యూరిటీ చెక్ పేరిట తన కృత్రిమ కాలును తొలగించి చూపించమంటున్నారనీ, దీంతో నరకం అనుభవిస్తున్నానని గురువారం ఆమె ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ నరకం పడలేననీ, తనకు సీనియర్ సిటిజన్ కార్డ్ ఇప్పించాలనీ ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి అప్పీల్ చేశారు. ఆన్లైన్లో ఆ వీడియో వైరల్ అవడం, సుధా చంద్రన్ పడుతున్న బాధలపై అందరూ సానుభూతి వ్యక్తం చేయడం, ఆమెను ఇబ్బందిపెడుతున్న అధికారుల వైనాన్ని ప్రశ్నించడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
దీంతో శుక్రవారం సీఐఎస్ఎఫ్ స్పందించింది. "సుధా చంద్రన్కు కలిగిన అసౌకర్యానికి మేం తీవ్రంగా చింతిస్తున్నాం. ప్రోటోకాల్ ప్రకారం, అసాధారణ సందర్భాల్లో మాత్రమే భద్రతా తనిఖీల కోసం కృత్రిమ అవయవాలను (ప్రాస్థటిక్స్) తొలగించమని చెబుతాం. ప్రాస్థటిక్స్ను తొలగించమని సుధా చంద్రన్ను సంబంధిత మహిళా సిబ్బంది ఎందుకు కోరారో మేం పరిశీలన జరుపుతాం. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ప్రోటోకాల్స్ విషయంలో మా మొత్తం సిబ్బందికి మరోసారి అవగాహన కల్పిస్తామని సుధా చంద్రన్కు హామీ ఇస్తున్నాం." అని ట్వీట్ చేసింది.
కృత్రిమ కాలుతోటే దేశం గర్వించదగ్గ డాన్సర్గా, యాక్టర్గా పేరుపొందిన సుధా చంద్రన్, గురువారం షేర్ చేసిన వీడియోలో తనను తాను ఒక యాక్టర్గా, డాన్సర్గా పరిచయం చేసుకున్నారు. "ఈటీడీ (ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్) పరీక్షలు చేయండి కానీ, ప్రతిసారీ తన కృత్రిమ కాలును తొలగించి చూపాల్సి రావడం బాధాకరంగా ఉంద"ని సీఐఎస్ఎఫ్ అధికారులను ఉద్దేశించి తెలిపారు. ఆ వీడియోకు, "టోటల్లీ హర్ట్.. ప్రతిసారీ దీన్ని ఎదుర్కోవడం చాలా చాలా బాధ కలిగిస్తోంది.. నా మెసేజ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులకు చేరుతుందని ఆశిస్తున్నాను. తగిన చర్యలు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను" అని కాప్షన్ పెట్టారు సుధా చంద్రన్.
Also Read