'చెడ్డి గ్యాంగ్ తమాషా' ట్రైలర్ ను రిలీజ్ చేసిన బ్రహ్మానందం!
on Dec 18, 2022

అబుజా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణ సారధ్యం లో, వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'చెడ్డీ గ్యాంగ్ తమాషా'. గాయత్రి పటేల్ హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. " వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా హీరోగా ఎంతో కష్టపడి అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడని అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా సహజంగా ఉంది. సినిమా బాగుంటే అదే సక్సెస్ అవుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. అందరూ సినిమాకి ఎంతో కష్ట పడి కృషి చేస్తారు. ఆ సినిమా సక్సెస్ ఫుల్ గా పైకి రావాలి అంటే అది చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ అని కాకుండా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ను మనం మెచ్చుకోవాలి అభినందించాలి. నిర్మాత క్రాంతి కిరణ్ చెడ్డి వరుసగా సినిమాలు తీస్తూ మంచి విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఎంత కష్ట పడి నిర్మించాడో నాకు అర్ధమైంది. చెడ్డీ గ్యాంగ్ తమాషా అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసాను. అందుకని ఒక హాస్య నటుడిగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి వచ్చాను. హాస్య నటులు తీసే సినిమాలు అన్ని సక్సెస్ కావాలి అని హాస్యం బయటకు రావాలి అని మా గురువుగారు జంధ్యాల గారు బతికి వున్నప్పుడు చెపుతూ వుంటారు. హాస్యాన్ని మనం బతికించాలి అని అందుకని ఈ ఫంక్షన్ కి నేను రావడం జరిగింది" అని అన్నారు
నిర్మాత క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. "సినీ నిర్మాత అనేవాడు రైతు లాంటి వాడు. మా డబ్బులతో మీకు వినోదాన్ని ఇచ్చే టందుకు కృషి చేస్తాము. మేము చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అందరికి నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి చెడ్డి గ్యాంగ్ తమాషా పార్ట్2 కూడా ఉంటుంది. ఆన్నీ కుదిరితే పార్టీ 2 లో బ్రహ్మానందం గారు కూడా నటిస్తారు" అని అన్నారు
హీరో, దర్శకుడు వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని. నేను అతను ఇన్స్పిరేషన్ తోనే సినీ ఇండస్ట్రీకి వచ్చాను. చెడ్డీ గ్యాంగ్ సినిమా కాన్సెప్ట్ ఏమిటంటే ఒక పల్లెలో భూస్వామి ఆ ఉరి జనాల్ని పీడిస్తూ ఉంటాడు. పుచ్చల పల్లి సుందరయ్య గారు లాంటి కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి ఆ పల్లెని ఎలా కాపాడాడు అని. భవిష్యత్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను. కొత్త వాడినైన నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత క్రాంతి కిరణ్ చాలా గొప్ప వ్యక్తి. నాలాగే టాలెంట్ ఉన్న వ్యక్తులకు అవకాశం ఇచ్చేందుకు రెడీ గా వున్నారు ఆయనకు నా కృతజ్ఞతలు.. ఇది కంప్లిట్ కామెడీ డ్రామా. అందరికి నచ్చుతుంది" అని అన్నారు.
హీరోయిన్ గాయత్రి పటేల్ మాట్లాడుతూ.. "ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో నేను చాలా అందంగా కనిపిస్తాను. నాకు ఈ ఆవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



