'మైండ్ బ్లాక్' సాంగ్లో మహేశ్ డాన్స్ ఇరగదీసేశాడు!
on Dec 29, 2019
"మహేశ్బాబుతో జర్నీ నా లైఫ్లో మర్చిపోలేనిది. హీరోగానే కాదు, వ్యక్తిగా కూడా ఆయన సూపర్స్టారే. అంత జెన్యూన్ పర్సన్. ఆఫ్స్క్రీన్ కూడా ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. అందుకే వ్యక్తిగా కూడా ఆయనంటే నాకు చాలా ఇష్టం. నన్ను నమ్మినందుకు సక్సెస్ రూపంలో ఈ సినిమాని ఆయనకు గిఫ్ట్లా ఇద్దామనుకుంటున్నాను" అని చెప్పాడు అనిల్ రావిపూడి. ఆయన డైరెక్షన్లో మహేశ్ హీరోగా నటించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. రష్మికా మందన్న హీరోయిన్గా నటించిన ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఆల్బంలోని చివరి పాట 'బ్యాంగ్ బాంగ్'ను శనివారం రాత్రి విశాఖ ఉత్సవ్లో మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ "గత ఏడాడి డిసెంబర్లో విశాఖ ఉత్సవ్కు వచ్చి 'ఎఫ్2' ఆడియో ఈవెంట్ చేశాం. సంక్రాంతికి ఆ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారో నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ సంవత్సరం కూడా ఈ విశాఖ ఉత్సవ్కు వచ్చి, 'సరిలేరు నీకెవ్వరు'లోని ఒక సాంగ్కు లాంచ్ చెయ్యాలని ప్లాన్ చేశాం. ఈ సినిమాకి ఫస్ట్ జడ్జి దేవి శ్రీప్రసాదే. ఆయనిచ్చిన ఫీడ్బ్యాక్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఆయన సినిమా మొత్తం చూశారు. చాలా బాగా వచ్చిందని చాలా నమ్మకంతో ఉన్నాం. సినిమాకి మ్యూజిక్ హెల్పయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలన్నింటినీ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు' యాంథం నాకు గూస్బంప్స్ తెప్పించింది. సినిమాలో అది ఒక అసాధారణ సందర్భంలో వచ్చే పాట. దానికి లైఫ్ పెట్టి మ్యూజిక్ ఇచ్చారు దేవి. జనవరి ఫస్ట్కి ఒక పాట కావాలంటే మంచి పార్టీ సాంగ్ ఇచ్చారు. 'మైండ్ బ్లాక్' సాంగ్లో మహేశ్ డ్యాన్స్ ఇరగదీసేశారు. సూపర్స్టార్ మహేశ్ నన్ను నమ్మి, ఈ అవకాశం ఇచ్చి, ఈరోజు మీముందుకు వచ్చేలా చేశారు. 'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్ బాడీ లాంగ్వేజ్, ఆయన చేసిన కామెడీ, రెస్పాన్సిబుల్గా చేసిన క్యారెక్టరైజేషన్.. ఒక ఆల్రౌండ్ షో చేశారు. ఆయన నటనకు అందరూ ఎగ్జైట్ అవుతారు. నేను 'డాడీ' అని ప్రేమగా పిలుచుకునే రాజేంద్రప్రసాద్ నా ప్రతి సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తుంటారు. ఈ సినిమాలో మరీ ముఖ్య పాత్ర చేశారు. మహేశ్బాబుతో ఆద్యంతం సినిమాలో ట్రావెల్ చేసే క్యారెక్టర్. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే ఎంటర్టైన్మెంట్కి కానీ, ఎమోషన్స్కి కానీ బాగా కనెక్టవుతారు. పదమూడేళ్ల తర్వాత విజయశాంతి ఈ సినిమాతో వస్తున్నారు. ఆమె చాలా ప్రత్యేక పాత్ర చేశారు. ఆమె పాత్రను బాగా లైక్ చేస్తారు. 'ఎఫ్2' ఎంతగా ఎంజాయ్ చేశారో, అంతకు మించి 'సరిలేరు నీకెవ్వరు'తో ఎంజాయ్ చెయ్యబోతున్నారు" అని తెలిపాడు.
Also Read